Hyderabad : భార్య కోసం ఇద్దరు భర్తల పోరాటం

ఆగస్టులో తన భార్య ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని... బంగారం, నగదు తన సమన్లను తీసుకుని వెళ్లిపోయిందని శశికాంత్‌ ఆరోపిస్తున్నాడు.

Hyderabad : భార్య కోసం ఇద్దరు భర్తల పోరాటం

Sr Nagar

One Wife Two Husbands : భార్య కోసం ఇద్దరు భర్తల పోరాటం.. వినేందుకు ఆశ్చర్యకరంగా ఉన్నా.. ఇది వాస్తవం. ఆమె నా భార్య.. కాదు కాదు ఆమె నా భార్యేనంటూ ఇద్దరూ ఆమె కోసం పట్టుబట్టడం కాదు.. కొట్టుకునే లెవల్‌కు వెళ్లిపోయారు. వ్యవహారం కొంచెం కొత్తగా ఉన్నా… అలాంటి షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకుందని ఒకరు కేసు పెడితే… తన భార్య కనిపించడం లేదంటూ మరొకరు పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కారు. ఈ విచిత్రమైన కేసు ఎస్సార్‌నగర్‌లో చోటుచేసుకుంది.

Read  More : Omicron Threat : ఒమిక్రాన్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం

పోలీస్ స్టేషనే కాదు… మరో అడుగు ముందుకేసి ఇద్దరు భర్తలు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె తన భార్యనే అంటూ ఒక్కరినొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. 22 సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి మరొక వ్యక్తితో వెళ్ళిపోయిందని ఒకరు… లేదు లేదు అసలు ఆమెకు అంతకు ముందెప్పుడూ పెళ్లే కాలేదని… ఇదంతా డ్రామా అని మరొకరు వాదిస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవకు కారణమైన ఆ వివాహిత సడన్‌గా మాయమైపోవడం ఈ కేసును మరో మలుపు తిప్పింది. పైగా సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More : MP Derek O’Brien : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి మరో ఎంపీ సస్పెండ్

వరంగల్‌ జిల్లాకు చెందిన శశికాంత్ అనే పురోహితుడు స్థానికంగా ఓ ఆలయంలో పనిచేస్తున్నాడు. ఆయనకు 1999లో వివాహం జరిగింది. తనకు ఇద్దరు పిల్లలున్నారు. ఆగస్టులో తన భార్య ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయిందని… బంగారం, నగదు తన సమన్లను తీసుకుని వెళ్లిపోయిందని శశికాంత్‌ ఆరోపిస్తున్నాడు. తన భార్య అదృశ్యంపై వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో శశికాంత్ ఫిర్యాదు చేశాడు. ఫేస్‌బుక్‌ ద్వారా తన భార్యను సత్యవరప్రసాద్‌ ట్రాప్‌ చేశాడని… ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇప్పుడు తాను భర్తను కాదని.. పిల్లలు కాదని అంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.