Online Betting : హుజూరాబాద్ ఉపఎన్నికపై వంద కోట్లకు పైగా బెట్టింగ్

హుజూరాబాద్ ఉపఎన్నికపై.. జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే.. బుకీలతో పాటు సర్వే టీమ్‌లు ల్యాండైపోయాయి. హుజూరాబాద్ పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు.. వాళ్లంతా తెగ ట్రై చేస్తున్నారు.

Online Betting : హుజూరాబాద్ ఉపఎన్నికపై వంద కోట్లకు పైగా బెట్టింగ్

Online Betting

Huzurabad by-election : హుజూరాబాద్ ఉపఎన్నికపై.. జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇప్పటికే.. బుకీలతో పాటు సర్వే టీమ్‌లు ల్యాండైపోయాయి. హుజూరాబాద్ పబ్లిక్ పల్స్ పట్టుకునేందుకు.. వాళ్లంతా తెగ ట్రై చేస్తున్నారు. కేవలం.. ఆన్‌లైన్‌లోనే వంద కోట్లకు పైగా బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. తెలంగాణ, ఏపీకి చెందిన వాళ్లు బెట్టింగ్‌లు కాస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఏపీ నుంచి కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు హుజూరాబాద్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచే కాకుండా.. మహారాష్ట్ర నుంచి బెట్టింగ్ సర్వే టీమ్స్‌ వచ్చినట్లు సమాచారం.

ఈ మధ్యే కొందరు.. ఆంధ్ర నాయకులు, వ్యాపారులు నేరుగా హుజూరాబాద్ వచ్చి ఇక్కడి పరిస్థితులను పరిశీలించి వెళ్లారు. వీటిపై.. రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విజయవాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, విశాఖ, మహారాష్ట్ర, నాందేడ్, ముంబై నుంచి.. బెట్టింగ్ సర్వే టీమ్స్ వచ్చి…లెక్కలు వేసుకొని వెళ్లారు.

Huzurabad : హుజూరాబాద్‌ లో జోరుగా ప్రలోభాల పర్వం.. ఒక్కో ఓటరుకు రూ. 6 వేలు

హుజురాబాద్‌లో అప్పుడే ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు మద్యం, మాంసం పంచుతున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో నగదు పంపిణీ కూడా జోరుగా సాగుతుంది. ఇంటింటికి తిరిగి మరీ డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటుకు 6 వేల రూపాయల చొప్పున ఎన్వలప్‌ కవర్‌లో పెట్టి మరీ అందిస్తున్నారు.

అయితే కొంతమంది డబ్బులు రానివారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి కమలాపూర్‌ మండలంలో మహిళలు ఆందోళన చేశారు. ఆరువేల రూపాయలు కొంతమందికి మాత్రమే ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ఆరోపించారు. వారికి అనుకూలంగా ఉన్నవారికే డబ్బులు పంపిణీ చేస్తున్నారని స్థానిక మహిళలు తెలిపారు.
Election Campaign: ముగిసిన ప్రచారం పర్వం.. హుజూరాబాద్, బద్వేల్‌లో హోరాహోరీ పోటీలు

తెలంగాణలోని హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 48 గంటలే మిగిలి ఉన్నాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో గత రాత్రి 7 గంటల నుంచే మైకులతో పాటు మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. శనివారం రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులను మూసివేసి ఉంచనున్నారు.