డాక్టర్లు లేకపోవడంతో మహిళకు డెలివరీ చేసిన సిబ్బంది..శిశువు మృతి

కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డ్యూటీ టైమ్‌కు డాక్టర్లు రాకపోవడంతో.. సిబ్బందే ఓ మహిళకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది వచ్చీరాని వైద్యం చేయడంతో.. శిశువు మృతి చెందింది.

డాక్టర్లు లేకపోవడంతో మహిళకు డెలివరీ చేసిన సిబ్బంది..శిశువు మృతి

Hospital Staff delivered woman, the baby died : కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాముకాటుకు కుక్కకాటు మందిచ్చిన ఘటన మరువకముందే.. విధుల విషయంలో మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డ్యూటీ టైమ్‌కు డాక్టర్లు రాకపోవడంతో.. సిబ్బందే ఓ మహిళకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది వచ్చీరాని వైద్యం చేయడంతో.. శిశువు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంటరై వ్యవహారాన్ని చక్కదిద్దారు.

మార్చి 6న పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. పాము కాటేసిందని ఆసుపత్రికి వెళ్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్‌ను వేసారు. భరత్ రెడ్డి అనే యువకుడికి ఈ నెల 2వ తేదీన పాము కాటేయడంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ను చూపి చికిత్స చేయవలసిందిగా సిబ్బందిని కోరాడు. అయితే ప్రిస్క్రిప్షన్ ను సరిగా పరశీలించని సిబ్బంది పాము కాటు ఇంజక్షన్‌కు బదులు కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్‌ను ఇచ్చి, రెండో డోసుకు 5వ తేదీ రావాలని సదరు యువకుడికి సూచించారు.

సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడికి అనుమానం కలిగి పాము కాటుకు ఒక్కసారే ఇంజక్షన్‌ ఇస్తారు కదా అని నిలదీశాడు. దానికి బదులుగా సిబ్బంది చెప్పిన మాటలు విన్న యువకుడు అవాక్కయ్యాడు. పాము కరిచిందని వస్తే కుక్క కాటుకు ఇచ్చే ఇంజక్షన్‌ ఇస్తారా అని సిబ్బందిపై మండిపడ్డాడు. బాధితుడు ఒక్కసారిగా విరుచుకుపడటంతో సిబ్బంది అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. సిబ్బంది నిర్వాకానికి షాక్‌కు గురైన యువకుడు బోరున విలపిస్తూ సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యుడిని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.