Alai Balai: ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మంచు విష్ణు

దసరా తర్వాత రోజు మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రతీ ఏటా నిర్వహించే కార్యక్రమం ‘దత్తన్న అలయ్ బలయ్’.

Alai Balai: ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, మంచు విష్ణు

Pawan Kalyan

Alai Balai: దసరా తర్వాత రోజు మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రతీ ఏటా నిర్వహించే కార్యక్రమం ‘దత్తన్న అలయ్ బలయ్’. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు కనిపించారు. పార్టీలకు అతీతంగా నేతలంతా కలుసుకునే ఈ కార్యక్రమాని ఈసారి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ హీరో మంచు విష్ణు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కూడా విచ్చేశారు. తెలుగురాష్ట్రాల మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతి కళ్లకు కట్టేలా అలయ్ బలయ్‌లో కళాకారుల నృత్యాలు, తెలంగాణ షడ్రుచుల వంటకాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఒకరినొకరు కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం అలయ్ బలయ్ ప్రత్యేకత కాగా.. ఈ ఏడాది కూడా అదే తీరు కొనసాగింది.