Pawan Kalyan-Sharmila: షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ రియాక్షన్

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు.

Pawan Kalyan-Sharmila: షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ రియాక్షన్

Pawan Kalyan

Pawan Kalyan-Sharmila: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. కొత్తపార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని, షర్మిలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కొత్తపార్టీలు రావాలని, ఆ పార్టీలు ప్రజలకు మేలుచేసే విధంగా ఉండాలలన్నారు. షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేలని, కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. అలాంటి వారిని జనసేన గుర్తించి ప్రోత్సాహిస్తుందన్నారు. పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైన పనని, కుటుంబ వారసత్వ రాజకీయం ఉన్నవాళ్లే కాకుండా ఇతరులు కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

ఇవాళ(08 జూన్ 2021) వైఎస్ఆర్ జయంతి సంధర్భంగా షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ అఫిషియల్‌గా ప్రకటించనున్నారు. ఇవాళ సాయంత్రమే పార్టీ ప్రకటన ఉండగా.. ఇప్పటికే షర్మిల ఇడుపులపాయలో వైఎస్ ఘాట్‌లో నివాళులు అర్పించి హైదరాబాద్ బయలు దేరారు. మధ్యాహ్నం పంజాగుట్ట‌లోని వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులర్పించి సాయంత్రం పార్టీ ప్రకటన చేయనున్నారు.