క్షేమంగా తల్లి ఒడికి, హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

  • Published By: naveen ,Published On : October 20, 2020 / 11:09 AM IST
క్షేమంగా తల్లి ఒడికి, హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

kidnap case: హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో కిడ్నాప్ అయిన చిన్నారి కథ సుఖాంతం అయ్యింది. యాదాద్రి భువనగిరిలో మహిళా కిడ్నాపర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాపర్ నుంచి బిడ్డను కాపాడిన పోలీసులు సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. బాధితురాలు తన బిడ్డతో కలిసి భర్త కోసం మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వచ్చింది.


ఎంజీబీఎస్ బస్టాండ్ లో తల్లికి మత్తుమందు ఇచ్చిన కిడ్నాపర్లు బిడ్డను ఎత్తుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన యాదాద్రి భువనగిరి పోలీసులు కిడ్నాప్ కేసుని మూడు గంటల్లోనే చేధించారు. బిడ్డ క్షేమంగా తల్లి ఒడిగి చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ ని పట్టుకుని బిడ్డని క్షేమంగా కాపాడిన పోలీసులను అంతా ప్రశంసిస్తున్నారు.

భర్త ఆచూకీ చెబుతామంటూ, కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి బాలిక కిడ్నాప్:
మహబూబ్‌నగర్‌ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పు తాళ్ల రాజు జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. నాలుగు రోజులైనా తిరిగి రాకపోవడంతో మూడేళ్ల వయసున్న బిడ్డతో కలిసి హైదరాబాద్‌కు చేరుకుంది రాజు భార్య. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్‌లో కిడ్నాపర్లు తల్లిని ట్రాప్ చేశారు. భర్త ఆచూకీ చెబుతామంటూ తల్లీబిడ్డను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. తల్లి స్పృహ కోల్పోవడంతో బిడ్డను ఎత్తుకెళ్లారు. తల్లి ఫిర్యాదుతో మూడు గంటల్లోనే కిడ్నాప్‌ మిస్టరీ ఛేదించారు యాదాద్రి భువనగిరి పోలీసులు. మహిళా కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసి.. బిడ్డను తల్లికి అప్పగించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు.

mother