Narabali Case: నరబలి కేసులో మొండెం గుర్తించిన పోలీసులు.. హైదరాబాద్లోనే హత్య!
నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెంలేని తల మిస్టరీని ఛేదించారు పోలీసులు.
Narabali Case: నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన మొండెంలేని తల మిస్టరీని ఛేదించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో శిరసులేని మొండేన్ని గుర్తించారు. ఇళ్ల మధ్యలో ఓ ఇంటిపైన మొండెం ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ కేసులో మహంకాళి అమ్మవారి దగ్గర దొరికిన తల కేసులో హైదరాబాద్లోనే వ్యక్తిని హత్య చేసి నిందితులు తలతీసికెళ్లినట్లు గుర్తించారు.
ఈ కేసు చేధనలో 12బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా.. క్లూస్ టీం.. డాగ్ స్వ్కాడ్తో తనిఖీలు చేశారు. రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని గుర్తించారు. నిర్మాణంలో ఉన్న కేశవనాయక్ ఇంటిపై మొండెంను గుర్తించారు.
శరీర భాగం జైహింద్ది గానే గుర్తించిన బందువులు.. తుర్కఎంజాల్ చౌరస్తాలోనే జహింద్ నివాసం ఉన్నట్లు గుర్తించారు. నరబలి చేశారా? అన్న కోణంలోనే దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేయగా.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే యువకుడిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న సందేహాలకు సమాధానం దొరకలేదు.