వామన్‌రావు దంపతుల హత్యపై స్పందించిన పుట్ట మధు..

వామన్‌రావు దంపతుల హత్యపై స్పందించిన పుట్ట మధు..

lawyer Vamanrao couple murder : లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్యపై జడ్పీ ఛైర్మన్‌ పుట్టా మధు స్పందించారు. కాంగ్రెస్‌ కుట్రలకు మీడియా తోడయ్యిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్‌రావు దంపతుల హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్‌ చేస్తుందా? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారో తెలియట్లేదన్నారు. ఎప్పుడు తనను అరెస్టు చేస్తారా అని ఎదురుచూస్తున్నారన్నారు. ముఖం చాటేశారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. అలాగే.. కాంగ్రెస్ నేతలపైనా పుట్టా మధు విమర్శలు చేశారు.

మంథనిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా మధు..తాను సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినట్లు దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఎప్పుడు తనను అరెస్టు చేస్తారా అని ఎదురుచూస్తున్నారన్నారు. ముఖం చాటేశారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసు విచారణ తర్వాత హైదరాబాద్‌ వచ్చి మీడియాకు వాస్తవాలు వెల్లడిస్తానన్నారు.

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు రౌడీయిజం చేస్తున్నట్లు చెబుతున్నారని, కానీ అసలు రౌడీయిజం చేసేది శ్రీధర్‌బాబు, ఆయన తమ్ముడేనంటూ వ్యాఖ్యానించారు పుట్టా మధు. తమతో ఎవరికీ ఇబ్బంది లేదని, శ్రీధర్‌బాబుతోనే అందరికీ ఇబ్బంది అని అన్నారు.