Rahul Gandhi : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ చేరుకున్న రాహుల్ గాంధీ..
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ చేరుకున్నారు. ముందుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘనస్వాగతం పలికారు.
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ చేరుకున్నారు. ముందుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ బయల్దేరారు. మొదట వరంగల్ గాబ్రియల్కు స్కూల్ గ్రౌండ్కు రాహుల్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్జీపులో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లోని సభా ప్రాంగణానికి ర్యాలీగా రాహుల్ బయల్దేరారు. రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 7 గంటలకు వరంగల్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాహుల్ రైతు సంఘర్షణ సభలో రైతులనుద్దేశించి ప్రసంగించనున్నారు. వరంగల్లో సభ ముగిసిన అనంతరం రాహుల్ రోడ్డు మార్గాన హైదరాబాద్ పయనం కానున్నారు.
రైతు సంఘర్షణ సభలో రాహుల్ ఏం మాట్లాడుతారు అనేది ఉత్కంఠగా మారింది. రాహుల్ వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ పై ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణలో కొత్త వ్యవసాయ విధానంపై డిక్లరేషన్ ఉండబోతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ ప్రకటనపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాహుల్ తెలంగాణ కాంగ్రెస్కు ఏ విధంగా దిశా నిర్దేశం చేస్తారు అనేది ఆసక్తిగా తెలంగాణ ప్రజానీకం ఎదురుచూస్తోంది.
Read Also : Rahul gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. షెడ్యూల్ ఇలా..