Raja Singh: మోదీ, అమిత్ షాలకు లేఖ రాసిన రాజాసింగ్

ఆ సమాచారంలో తనను, తన కుటుంబాన్ని సూసైడ్ బాంబు ద్వారా చంపేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందని ఆరోపించారు. తెలంగాణ నిఘవర్గాలు ఎలాంటి క్రిటికల్ సమాచారం తనకు చెప్పడం లేదని రాజాసింగ్ విమర్శించారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, వీలైనంత త్వరగా వీటిపై చర్యలు తీసుకోగలరంటూ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.

Raja Singh: మోదీ, అమిత్ షాలకు లేఖ రాసిన రాజాసింగ్

Raja Singh

Raja Singh: తన కుటుంబానికి భద్రత కల్పించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు భారతీయ జనతా పార్టీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. హైదరాబాదులో రోజురోజుకు ప్రజల భద్రత దిగజారిపోతుందని, ఇంటిలిజెన్స్ వారి నుండి అత్యంత విశ్వసనీయ సమాచారం ఒకటి తనకు వరకు వచ్చిందని లేఖలో ఆయన అన్నారు. ఆ సమాచారంలో తనను, తన కుటుంబాన్ని సూసైడ్ బాంబు ద్వారా చంపేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందని ఆరోపించారు. తెలంగాణ నిఘవర్గాలు ఎలాంటి క్రిటికల్ సమాచారం తనకు చెప్పడం లేదని రాజాసింగ్ విమర్శించారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, వీలైనంత త్వరగా వీటిపై చర్యలు తీసుకోగలరంటూ లేఖలో రాజాసింగ్ పేర్కొన్నారు.

Imran Khan Arrest: ఇమ్రాన్‌ ఖాన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఎన్ఏబీకి చీవాట్లు