Omicron: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. ఖమ్మంలో తొలికేసు నమోదు

ఒమిక్రాన్ భారత్‌లనూ వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు కనిపిస్తూనే ఉన్నాయి.

Omicron: వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్.. ఖమ్మంలో తొలికేసు నమోదు

Khammam

Omicron: ఒమిక్రాన్ భారత్‌లనూ వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు కనిపిస్తూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఖమ్మం పట్టణంలోని వైరారోడ్డులో ఓ అపార్ట్మెంట్‌లో 21ఏళ్ళ యువతికి ఓమిక్రాన్ నిర్దారణ అయ్యింది.

ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మంలో తన ఇంటికి వచ్చిన 21ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి 19వ తేదీన జలుబు, దగ్గు ఉండటంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శాంపిల్ ఇవ్వగా పాజిటివ్ వచ్చింది. ఒమిక్రాన్ లక్షణాలు కనిపించగా.. హైదరాబాద్ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపగా ఒమిక్రాన్ అని తేలింది. వెంటనే యువతిని హైదరాబాద్ కిమ్స్‌కు తరించారు అధికారులు.

యూరప్ దేశాల్లో లక్షల్లో కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలకు కారణమైన ఒమిక్రాన్ మనదేశంలో మూడో వేవ్‌కు కారణం కావచ్చనే నిపుణులు చెబుతుండగా.. ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పుడు ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ప్రైమరీ కాంటాక్ట్ కింద యువతి కుటుంబీకులకూ పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారి శాంపిళ్లను కూడా ల్యాబ్‌కు పంపారు.