Revanth Reddy : ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మమేమిటి? : రేవంత్ రెడ్డి

ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనికి కేటీఆర్ కారణమని ఆరోపించారు.

Revanth Reddy : ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మమేమిటి? : రేవంత్ రెడ్డి

Revanth Reddy (1)

Revanth Reddy : ఓఆర్ఆర్ అంశంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత శాఖా మంత్రికి ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇరుక్కుపోతాననే కేటీఆర్ ముఖం చాటేశారని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అంశంపై కేటీఆర్ మౌనం వెనక మర్మం ఏమిటి? అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. అరవింద్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.

మాజర్ సంస్థ నివేదిక ప్రకారం టెండర్లు ఇచ్చామని సమర్థించుకుంటున్నారని వెల్లడించారు. మాజర్ సంస్థపై అమెరికాలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉండేదన్నారు. ఐఆర్బీకి అప్పగించేందుకు ఓఆర్ఆర్ ను హెచ్ ఎమ్ డీఏ పరిధిలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీని వెనకా దాగి ఉన్న గూడుపుఠానీ ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Revanth Reddy : ఓఆర్ఆర్ ను 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకు అమ్మేసిన కేసీఆర్ : రేవంత్ రెడ్డి

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొంటామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు ప్రయివేటుకు కట్టబెడుతున్నారో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నేషనల్ హైవే అథారిటీ అభ్యంతరం చెప్పిందన్నారు. ఎన్ హెచ్ఏఐ నిబంధనల ప్రకారం టెండర్లు ఇవ్వలేదని వెల్లడించారు. బేస్ ప్రైస్ నిర్ణయించకుండా టెండర్ ఎవరైనా పిలుస్తారా? అని నిలదీశారు. టోల్ గేట్ పై రోజుకు రూ.2కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

ఏడాదికి రూ.730 కోట్లు.. 30 ఏళ్లకు రూ.22వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.16వేల కోట్లు బ్యాంకు రుణం వస్తుందని చెప్పారు. కానీ, ప్రభుత్వం తక్కువ ధరకే ప్రయివేటుకు కట్టబెట్టిందని విమర్శించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో బేస్ ప్రైస్ రూ.7,388 కోట్లతో టెండర్లకు పిలవాలని సూచించారు. ఐఆర్బీ కంపెనీని ముందు పెట్టి తరువాత కేటీఆర్ బినామీ కంపెనీలతో ఇందులోకి ప్రవేశించే కుట్ర జరుగుతోందన్నారు.

Revanth Reddy : 50లక్షల మంది జీవితాలతో చెలగాటం- కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

30 ఏళ్లు వీళ్లే దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బేస్ ప్రైస్ పెట్టాము కానీ చెప్పబోమని అంటున్నారని వెల్లడించారు. అందులో ఏమైనా దేశ భద్రత, కేసీఆర్ ప్రాణం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. బేస్ ప్రైస్ చెప్పడానికి ఏమిటి నష్టమని నిలదీశారు. తాము లేవనెత్తిన ఏ ప్రశ్నకు అరవింద్ కుమార్ సమాధానం చెప్పలేదన్నారు. ఆర్టీఐ ప్రకారం మేం అడిగిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదని తెలిపారు. సీబీఐ, ఈడీకి కూడా సమాధానం ఇవ్వరా? అని అడిగారు.

తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలన్నారు. తెలంగాణ ఆస్తుల్ని కేసీఆర్ ప్రైవేట్ కు అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. లక్ష కోట్ల రూపాయల విలువైన ఓఆర్ఆర్ ను అగ్గువకే ప్రైవేట్ కు కట్టబెడుతున్నారని విమర్శించారు. స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డీవోపీటీకి అరవింద్ కుమార్ పై ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Solar-Roof Cycling Track: ఓఆర్ఆర్‌ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

ఓఆర్ఆర్ అంశంపై కాగ్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని.. దీనికి కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా తండ్రీకొడుకులు వివరణ ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ కేబినెట్ కు అతీత శక్తులు లేవన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదన్నారు. మే8న సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ సరూర్ నగర్ లో ప్రియాంక గాంధీ సభ ఉంటుందని తెలిపారు.

సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులు, నిరుద్యోగులను ఎలా ఆదుకుంటామో సభలో చెబుతామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఆదాయాన్ని 30 ఏళ్లకు తనఖా పెట్టి బ్యాంకు నుంచి రూ.15వేల కోట్ల రుణాన్ని 48 గంటల్లో ఇప్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నానని తెలిపారు. ఈ స్విస్ ఛాలెంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు.