Devender Gowd: టీడీపీ నేత దేవేందర్ గౌడ్ని కలిసిన రేవంత్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తుక్కుగూడలోని దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో కాసేపు మాట్లాడారు.
Rewanth Reddy: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తుక్కుగూడలోని దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో కాసేపు మాట్లాడారు. ఈ సంధర్భంగా రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎల్బీనగర్ కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్రెడ్డి.. దేవేందర్గౌడ్ ఆశీర్వాదం తీసుకోవడానికే దేవేందర్గౌడ్ ఇంటికి వచ్చినట్లు స్పష్టం చేశారు. వారి ఆలోచనలు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని, సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దారి తప్పిందని, సరైన దారిలో పట్టాలెక్కించాలంటే, దేవేందర్ గౌడ్ గారి సూచనలు, అనుభవం కూడా అవసరం అని వారితో కలిసి పనిచేస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం పనిచేస్తామని, కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలనే ఆలోచన చేసింది దేవేందర్గౌడ్ అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. దానిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ, రీ డిజైన్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నది టీఆర్ఎస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైపాల్రెడ్డి, దేవేందర్గౌడ్ రాజకీయ విలువలకు ప్రతీకలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం కోసం దేవేందర్గౌడ్ పనిచేశారని అన్నారు.