Road Accident:పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మహిళా ఏఎస్‌ఐ మృతి.

దీంతో ఆమె లారీ టైర్లకింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక ఈ ప్రమాదంలో ఆమె కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో ఏఎస్‌ఐ భాగ్యలక్ష్మి కూతురు స్కూటీ నడుపుతున్నారు.

Road Accident:పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మహిళా ఏఎస్‌ఐ మృతి.

Road Accident

Road Accident: పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కమాన్‌పూర్‌ ఏఎస్‌ఐ భాగ్యలక్ష్మి మృతి చెందారు. పెద్దపల్లిలోని తన నివాసం నుంచి కూతురుతో కలిసి బస్టాండ్‌కు వెళ్తుండగా పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద లారీ వేగంగా వచ్చి భాగ్యలక్ష్మి వెళ్తున్న స్కూటీని వెనుక నుంచి ఢీకొంది.

దీంతో ఆమె లారీ టైర్లకింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో ఆమె కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో ఏఎస్‌ఐ భాగ్యలక్ష్మి కూతురు స్కూటీ నడుపుతున్నారు.

ప్రమాద విషయం తెలుసుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ రాజేశ్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Read:Sand Mafia : ఇసుక లారీ డ్రైవర్లనుంచి డబ్బులు వసూళ్లు..నలుగురు కానిస్టేబుల్స్ సస్పెండ్