Mancherial : రోడ్డు ప్రమాదం.. కలెక్టర్ గన్‌మెన్‌ మృతి

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జాపుర్ మండలం ఇందారం చెక్ పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో బైక్ ను పాల వ్యాను ఢీకొంది.

Mancherial : రోడ్డు ప్రమాదం.. కలెక్టర్ గన్‌మెన్‌ మృతి

Mancherial

Mancherial : మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జాపుర్ మండలం ఇందారం చెక్ పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో బైక్ ను పాల వ్యాను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి వివరాలు సేకరించారు. మృతుడిని మల్లేశంగా గుర్తించారు పోలీసులు.

Read More : AP : బద్వేల్ ఉప ఎన్నిక..నోటిఫికేషన్

అతడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గన్‌మెన్‌ పనిచేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పాల వ్యాను డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Read More : Telangana : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, హరితహారంపై చర్చ