Twitter Case : ట్విట్టర్‌కు మరో షాక్.. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు..దేశంలోనే రెండోది..

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. దేశంలో రెండో కేసు హైదరాబాద్‌లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేశారు.

Twitter Case : ట్విట్టర్‌కు మరో షాక్.. కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు..దేశంలోనే రెండోది..

Twitter Case

Twitter Case : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు మరో షాక్ తగిలింది. దేశంలో రెండో కేసు హైదరాబాద్‌లో నమోదైంది. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదు చేశారు. అంతేకాదు ట్విట్టర్ ఇండియా యాజమాన్యానికి నోటీసులు సైతం ఇచ్చారు. ఫేక్ వీడియోపై వస్తున్న అనుచిత కామెంట్లకు ట్విట్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో తెలిపారు హైదరాబాద్ పోలీసులు. నటి మీరా చోప్రా కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.

నటి మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై ట్విట్టర్ వెంటనే స్పందించాలని నోటీసుల్లో కోరారు పోలీసులు. అలాగే, పోలీసులను కించపరిచేలా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరు యువకుల వివరాలను కూడా తమకు అందించాలని ట్విట్టర్‌కు రాసిన లేఖలో కోరారు హైదరాబాద్ పోలీసులు.

గతేడాది జూన్ లో నటి మీరా చోప్రాపై అసభ్యకరమైన మేసేజ్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పట్లో సైబర్ క్రైమ్ లో కేసుతో పాటు.. నోటీసులు ఇచ్చారు. దీంతో మేసేజ్ లను డిలీట్ చేసింది ట్విట్టర్. అయితే ఆ మేసేజ్ లు పెట్టిన వ్యక్తి వివరాలు ఇవ్వకపోవటంతో మరోసారి ట్విట్టర్ కి నోటీసులు ఇచ్చారు పోలీసులు.

కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్‌కు మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విట్టర్‌కు ఇప్పటివరకూ లభిస్తున్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయింది. సామాజిక మాధ్యమాల్లో డిజిట‌ల్ కంటెంట్‌పై నియంత్రణ‌కు గానూ కేంద్రం తీసుకొచ్చిన నూత‌న ఐటీ నిబంధ‌న‌లు మే 25 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీని ప్రకారం.. ఇక నుంచి యూజర్ల అభ్యంతరకరమైన పోస్టులపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.