Telangana Congress : వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ గెలవదు అని కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం

తెలంగాణ‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటిరిగా అధికారం‌లోకి రాలేదని, మరొకరితో కలవాల్సిందే అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, హంగ్ ఏర్పడటం ఖాయమని.. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీనియర్లు ఫైర్ అయ్యారు.

Telangana Congress : వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్ గెలవదు అని కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం

Congress leaders fire on Komatireddy Venkat Reddy's comments

Telangana Congress : తెలంగాణ‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటిరిగా అధికారం‌లోకి రాలేదని, మాకు మరో ప్రత్యామ్నాయం లేదని, మరొకరితో కలవాల్సిందే అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, హంగ్ ఏర్పడటం ఖాయమని.. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీనియర్లు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గెలవదు అంటూ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలని వారి నమ్మకాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. అర్థం పర్ధంలేని అంచనాలతో ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఇది కార్యకర్తలను అవమానించటమేనన్నారు. ఊహాజనితంగా మాట్లాడి పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయవద్దని..అయోమయానికి గురిచేయవద్దని సూచించారు.

అలాగే మరో కాంగ్రెస్ నేత మల్లు రవి మాట్లాడుతూ..తెలంగాణలో హంగ్ అనే మాటేలేదని కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. పార్టీకి మేలు చేయకపోయిన ఫరవాలేదు. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్దు అంటూ కోమటిరెడ్డికి హితవు పలికారు. బీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ కు పోటీ అంటూ సూచించారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే లోటుపాట్లు ఏమన్నా ఉంటే సరిచేసుకోవచ్చు…కానీ ఇలా బాహాటంగా ఇష్టానుసారంగా మాట్లాడితే అది పార్టీకి నష్టం చేకూరుస్తుందని దీన్ని గుర్తించి మాట్లాడాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని మల్లు రవి తెలిపారు.

కాగా కోమటిరెడ్డి మంగళవారం (ఫిబ్రవరి 14,2023) మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ‌లో హాంగ్ అసెంబ్లీ వస్తుందని, ఏ పార్టీకి 60 స్థానాలు మించి రావని వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఒంటిరిగా అధికారం‌లోకి రాలేదని, మాకు మరో ప్రత్యామ్నాయం లేదని, మరొకరితో కలవాల్సిందేనని తేల్చిచెప్పారు. సీనియర్లు అందరం ఆరు నెలలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీకి 40-50 స్థానాలు వస్తాయని అన్నారు. మార్చి 1 నుంచి అందరం కలిసి పార్టీకోసం పనిచేస్తామన్నారు.

MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో హంగ్ ఖాయం.. కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగడటం పొలిటికల్ డ్రామా

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జిగా మాణిక్ ఠాక్రే వచ్చిన తరువాత పార్టీలో పరిస్థితులు బాగున్నాయని..తెలంగాణలోనే తాను త్వరలోనే పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని తెలిపారు. తానే కాకుండా పార్టీ గెలుపు కోసం అందరు కృషి చేసేలా దాంట్లో భాగంగా నేతలు ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని పాదయాత్రలు చేయాలని సూచించారు. ఆ పాదయాత్రల సందర్భంగా తెలంగాణ సాధించుకున్నది ఎందుకు? ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ బలంగా ఉందని, దానిని కాంగ్రెస్ నేతలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు తమ వారికే ఇవ్వాలనుకుంటే పార్టీ మునగడం ఖాయమని, గెలిచే వారికి సీట్లు ఇవ్వాలని వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో బలమైన పార్టీగా కాంగ్రెస్ ఉందని, కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్తుందని చెప్పారు. అయితే, ఫలితాల తరువాత మరొకరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందేనని, జరిగేదే నేను చెబుతున్ననంటూ వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పొగిడిన విషయంపై కూడా కోమటిరెడ్డి మాట్లాడుతూ..మాతో కలవాల్సిందే కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ‌లో కాంగ్రెస్‌ను పొగడటం కేసీఆర్ పొలిటికల్ డ్రామా అంటూ వ్యాఖ్యానించారు.