Telangana Police : మీకు డీజీపీ పోస్టు కావాలంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయిండీ : ఎమ్మెల్యే రాజాసింగ్

‘మీకు డీజీపీ పోస్టు కావాలంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయిండీ’ అంటూ తెలంగాణ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Telangana Police : మీకు డీజీపీ పోస్టు కావాలంటే నన్ను ఎన్‌కౌంటర్ చేయిండీ : ఎమ్మెల్యే రాజాసింగ్

Sensational comments of MLA Rajasingh on Telangana Police

Telangana Police : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పీడీ యాక్ట్ వంటి పలు కేసులతో జైల్లో ఉండి ఇటీవలే విడుదల అయిన రాజాసింగ్ తెలంగాణ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై ఎక్కువ కేసులు పెట్టినవారికి కేటీఆర్ డీజీపీ పోస్టు ఇస్తానని ఆశ పెట్టారేమో..అందుకే నాపై లేనిపోని కేసులన్నీ పెడుతున్నారు అంటూ ఆరోపించారు. అంతేకాదు మీకు డీజీపీ పోస్టు కావాలంటే నన్న ఎన్ కౌంటర్ చేయండీ అంటూ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి రాముడు అంటే ఎందుకు అంత పగ అంటూ ప్రశ్నించారు రాజాసింగ్. తాను ఏం మాట్లాడినా కేసులు పెట్టే పోలీసులు..తెలంగాణ ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు చేసే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఎందుకు చర్యలు తీసుకోరు? అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు దోస్తీ అటువంటిదని..ఎంఐఎం పార్టీ ఏం చెబితే అది చేయటమే టీఆర్ఎస్ పార్టీ పని అంటూ వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.

కాగా గత నవంబర్ లో రాజాసింగ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై పీడీ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. జైలు నుంచి విడుదలయ్యే వేళ ర్యాలీలు నిర్వహించకూడదని..మూడు నెలల పాటు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయొద్దని పేర్కొంది. మీడియా, సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. రాజాసింగ్ పై పోలీసులు పీడీ చట్టం నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్‌ భార్య ఉషా భాయి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజాసింగ్ కు బెయిల్ ఇవ్వటం..పీడీ యాక్ట్ ఎత్తివేయటం జరిగింది.