Kamareddy : డబ్బుల కోసం.. తల్లిని చంపాలని ఇంటికి నిప్పంటించిన ప్రబుద్ధుడు

తల్లి ఇంట్లో ఉందని భావించిన అశోక్ బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని ఇరుగు పొరుగువారు గమనించారు.

Kamareddy : డబ్బుల కోసం.. తల్లిని చంపాలని ఇంటికి నిప్పంటించిన ప్రబుద్ధుడు

set fire house

Kamareddy – Birkur : తెలంగాణలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. డబ్బుల కోసం నవమాసాలు మోసి కన్న తల్లినే కడతేర్చాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తల్లిని చంపాలని ఇంటికి నిప్పటించాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల చంద్రవ్వ – నారాయణ దంపతుల కుమారుడు అశోక్. తండ్రి నారాయణ గతంలోనే మృతి చెందాడు.

అశోక్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లతలతో అక్కడే ఉంటున్నాడు. దీంతో తల్లి చంద్రవ్వ బీర్కూర్ లోని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఇంటి పక్కన గల గదులను అద్దెకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అశోక్ నిత్యం డబ్బుల కోసం చంద్రవ్వను వేధించేవాడు. తల్లి పేరిట ఉన్న ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నిన అశోక్ సోమవారం మధ్యాహ్నం బీర్కూర్ కు వెళ్లాడు.

Britain : పెన్షన్ డబ్బుల కోసం.. స్నేహితుడి మృతదేహాన్ని రెండేళ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టిన వ్యక్తి..

తల్లి ఇంట్లో ఉందని భావించిన అశోక్ బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని ఇరుగు పొరుగువారు గమనించారు. ఆ సమయంలో తల్లి చంద్రవ్వ బయటి నుంచి రావడాన్ని చూసిన అశోక్ అక్కడి నుంచి పరారయ్యాడు.

హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా అశోక్ తనను విపరీతంగా కొడతాడని, డబ్బుల కోసం వేధిస్తాడని తల్లి చంద్రవ్వ వాపోయారు. ఇంటికి నిప్పంటించాడని తృటిలో తప్పించుకున్నట్లు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అశోక్ కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ బాల్ రెడ్డి పేర్కొన్నారు.