Telangana: అందుకే కేసీఆర్, రేవంత్ రెడ్డిని కలిశాను: సోయం బాపూరావు

ఎంపీ సోయం బాపూరావు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది.

Telangana: అందుకే కేసీఆర్, రేవంత్ రెడ్డిని కలిశాను: సోయం బాపూరావు

Soyam Bapurao

Soyam Bapu Rao: బీజేపీ (BJP) తెలంగాణ నేత, ఆదిలాబాద్ (Adilabad) ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, అందుకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారని ప్రచారం జరుగుతోంది. దీంతో సోయం బాపూరావు స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.

మే 27న తన కుమారుడి వివాహం ఉందని సోయం బాపూరావు చెప్పారు. ఈ నేపథ్యంలో శుభలేఖలను అన్ని పార్టీల వారికి ఇస్తున్నామని తెలిపారు. అందుకే తాను తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పారు. అప్పట్లో మహేశ్వర్ రెడ్డిని తానే బీజేపీలోకి ఆహ్వానించానని తెలిపారు. ఆయనతో ఇప్పుడు తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

ఉద్దేశపూర్వకంగానే తనపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని సోయం బాపూరావు అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై సోయం బాపూరావు స్పందిస్తూ ఆ రాష్ట్రం విజయం వరించినంత మాత్రాన భారత్ వ్యాప్తంగా గెలిచినట్లు కాదని చెప్పారు. ఆ రాష్ట్రంలో తమ పార్టీ ఓటమి పాలైనప్పటికీ ఓట్ల శాతం మాత్రం తగ్గలేదని చెప్పుకొచ్చారు. కాగా, రేవంత్ రెడ్డితో సోయం బాపూరావు టచ్ లో ఉన్నారంటూ ఇటీవల బాగా ప్రచారం జరిగింది.

YS Viveka Case : సీబీఐ ముందు విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి అనుచరులు వీరే..