High Court Judges: ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీకి కొలీజియం సిఫారసు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ..
మూడు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఏడుగురు బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు, మద్రాసు హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు.
High Court Judges: మూడు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఏడుగురు బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. గురువారం జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తులు, ఏపీ నుంచి ఇద్దరు, మద్రాసు హైకోర్టు నుంచి ఇద్దరిని బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
High Court: హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. వీరిలో జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీచేస్తూ కోలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు, అదేవిధంగా తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న మరో న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున్ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.
అదేవిధంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవనంద్ను మద్రాసు హైకోర్టుకు, అదే హైకోర్టులో పనిచేస్తున్న మరో న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. వీరితో పాటు మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్టి టి. రాజును రాజస్థాన్ హైకోర్టుకు, జస్టిస్ వి.ఎం. వేలుమణిని కోల్కత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు కొలీజియం న్యాయశాఖకు సిఫారసు చేసింది.