మున్సిపల్ ఫలితాలు : టీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం ఉంది

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఫలితాల్లో కారు హవా కనిపించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 05:59 AM IST
మున్సిపల్ ఫలితాలు : టీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం ఉంది

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఫలితాల్లో కారు హవా కనిపించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో

తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఫలితాల్లో కారు హవా కనిపించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో మెజార్టీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను టీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ ఫలితాలు టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాయి. నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచి హంగామా చేశారు. అటు తెలంగాణ భవన్ దగ్గర కోలాహలం నెలకొంది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు మున్సిపల్ ఫలితాలు అద్దం పట్టాయని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు. ఎన్నికలు ఏవైనా.. రిజల్ట్ రిపీట్ అవుతుందన్నారు. కారు జోరుకి అడ్డు ఉండదన్నారు. 2014కి ముందు 2014 తర్వాత.. పాలనలో ప్రజలు స్పష్టమైన తేడాను గమనిస్తున్నారని తలసాని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అనేకం ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామని, తక్షణమే వాటిని పరిష్కరిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి తలసాని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు టీవీలు, పేపర్లకే పరిమితం అయ్యాయని విమర్శించారు. వాళ్లు రియాల్టీలోకి రారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు కూడా దొరకలేదన్నారు. టీఆర్ఎస్ మాత్రమే రియాల్టీలోకి వస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటుందని మంత్రి అన్నారు.

శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి వార్డుకు రెండు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. మొద‌ట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభ‌జించి బండిల్‌గా కట్టి.. లెక్కిస్తుస్తారు.

120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి కూడా టీఆర్ఎస్ జోరు స్పష్టంగా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తొలి బోణీ కొట్టింది టీఆర్ఎస్సే. తొలుత పరకాల, చెన్నూరు మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది.