KTR : రూపాయికే నల్లా కనెక్షన్, దసరా వరకు తాగునీరు.. కేటీఆర్
రూపాయికే నల్లా కనెక్షన్ గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దసరా వరకు అందరికీ తాగునీరు అందిస్తామన్నారు.
KTR On One Rupee Tap Connection : రూపాయికే నల్లా కనెక్షన్ గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దసరా వరకు అందరికీ తాగునీరు అందిస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
వేములవాడలో ఎంత చేసినా తక్కువే అన్న కేటీఆర్.. వేములవాడ పట్టణంలో ఇంటి ఇంటికి నల్లా నీరు 60 శాతం పూర్తి అయ్యిందని.. దసరా వరకు పూర్తి చేసి అందరికీ తాగునీరు అందిస్తామన్నారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు. వేములవాడలో మార్కెట్ నిర్మాణం కోసం రూ. 5 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. గడిచిన ఏడేళ్లలో వేములవాడ అభివృద్ధి ఎలా ఉందో మీరే చూసి చెప్పాలన్నారు. 10వ వార్డులో కమ్యూనిటీ మహిళా భవనానికి తక్షణమే రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇళ్లు, కంకర కుప్పలను తొలగించాలన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచిందని, రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారని, ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని.. ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామన్నారు. వేములవాడ పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి @KTRTRS ప్రసంగించారు. వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని.. ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామన్నారు. pic.twitter.com/3QK4xtdFMS
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 3, 2021