అమ్మా..మళ్లీ జన్మంటూ ఉంటే నీకు కూతురిగా పుట్టించొద్దని దేవుడిని కోరుకుంటున్నా..

అమ్మా..మళ్లీ జన్మంటూ ఉంటే నీకు కూతురిగా పుట్టించొద్దని దేవుడిని కోరుకుంటున్నా..

Telangana : Nizamabad new married couple suicide attempt : కూతురిని కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన అమ్మ కన్నకూతుర్ని వేధింపులకు గురిచేసింది. మనసిచ్చినవాడికే దగ్గరుండి మరీ పెళ్లిచేసింది. కూతురు ప్రేమించిన యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోకుపోయినా మీకు నేనున్నానని ధైర్యమిచ్చి దగ్గరుండి కూతురు కోరుకున్నవాడితో పెళ్లిచేసింది. ఇద్దరినీ తన ఇంటికి తీసుకెళ్లింది.

మరి ఆ తరువాత ఆమె ఏమనుకుందో గానీ కూతురిని సాధించటం మొదలుపెట్టింది.కూతురితో పాటు అల్లుడిని కూడా నానా మాటలు అనేది. ఆ వేధింపులు కాస్తా కొత్త జంట ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్లింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ కూతురు ‘‘అమ్మా నిన్ను ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటా..నాకు మరో జన్మంటూ నీకు మాత్రం కూతురిగా పుట్టించొద్దని ఆ దేవుడిని వేడుకుంటున్నా’’అంటూ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన సాయి ప్రణీత్, విజయ కొంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ప్రణీత్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి తల్లి సావిత్రి ‘‘వాళ్లు ఒప్పుకోకపోయినా..మీకు నేనున్నానంటూ ధైర్యం చెప్పింది. ఇద్దరినీ ఓగుడిలోకి తీసుకెళ్లి పెళ్లి చేసింది. తరువాత ఇద్దరినీ తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లింది.

అలా నెలరోజులు గడిచాయి. ఆ తరువాత ఏమైందో ఏమోగానీ సావిత్రి కూతురు విజయని వేధించటం మొదలు పెట్టింది. కూతురితో పాటు అల్లుడు ప్రణీత్ ను కూడా నానా మాటలు అనేది. రోజు రోజుకు తల్లి వేధింపులు ఎక్కువవ్వటంతో విజయకు ఏం చేయాలో తెలియలేదు.

ఈక్రమంలో పెళ్లి చేసుకుని కూతురినీ, అల్లుడిని ఇంట్లో పెట్టుకుని..తమ కొడుకు ప్రణీత్ ను వేధిస్తోందని తెలిసిన అతని తల్లిదండ్రులు వచ్చి కొడుకుని కోడలిని తమతో పాటు తీసుకెళ్లిపోయారు. కానీ సావిత్రి వారిని విడిచిపెట్టలేదు. ప్రణీత్ వాళ్ల ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలు పెట్టింది. దీంతో తమ పెళ్లి వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కొత్త జంట.

ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ పురుగుల మందు తాగారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు నెల రోజుల తిరగకుండానే ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.దీంతో అపస్మారక స్థితిలో ఉన్న జంటను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అబ్బాయి ప్రణీత్ మృతి చెందగా..అమ్మాయి విజయ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.

విజయ పురుగుల మందు తాగేముందు..తన ఆత్మహత్యకు తన తల్లి వేధింపులు కారణం అని రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు ఇంట్లో లభించింది. ‘‘తన తల్లి వేధింపులు భరించలేకే చావడానికి సిద్ధపడుతున్నగా రాసింది. ‘పెళ్లి అయినప్పటి నుంచి అమ్మ వేధింపులకు గురి చేస్తోందని లెటర్ లో ఆరోపించింది.

తనతోపాటు తన భర్తను కూడా ఇబ్బందులు పెడుతోందని..మా అత్తమామలపై కూడా కేసు పెడతామని బెదిరిస్తోందనీ…మా చావుకు కారణమైన అమ్మను జీవితంలో క్షమించను. ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటానని విజయ సూసైడ్ నోట్‌‌లో పేర్కొంది. మరో జన్మంటూ ఉంటే నీ కూతురిగా పుట్టొద్దని దేవుడిని కోరుకుంటున్నా’ అని విజయ అందులో రాసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మచెందర్ రెడ్డి తెలిపారు.