jaggareddy Vs YS Sharmila : షర్మిల ఆడపిల్ల కాబట్టి తిట్టలేకపోతున్నా.. లేకుంటేనా : జగ్గారెడ్డి

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్లుగా ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరుగుతోంది. జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్టు అంటూ షర్మిల ఆరోపిస్తే..జగ్గారెడ్డి నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను అంటూ షర్మిలపై విమర్శలు చేశారు జగ్గారెడ్డి.  

jaggareddy Vs YS Sharmila :  షర్మిల ఆడపిల్ల కాబట్టి తిట్టలేకపోతున్నా.. లేకుంటేనా : జగ్గారెడ్డి

jaggareddy Vs YS Sharmila

jaggareddy Vs YS Sharmila : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్లుగా ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరుగుతోంది. జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్టు అంటూ షర్మిల ఆరోపిస్తే..జగ్గారెడ్డి నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను అంటూ షర్మిలపై విమర్శలు చేశారు జగ్గారెడ్డి.  సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని..ఈ విషయం గాంధీభవన్ మొత్తం తెలుసు అంటూ షర్మిల ఆరోపించారు. షర్మిల చేసిన ఈ విమర్శలపై జగ్గారెడ్డి స్పందించారు. షర్మిలమ్మా..నువ్వు ఆడపిల్లవు కాబట్టి నిన్నేమి అనలేకపోతున్నా..తిట్టలేకపోతున్నానన్నారు జగ్గారెడ్డి.నన్నుకోవర్టు అనటం సరికాదని సూచించారు. కేటీఆర్ గానీ..కేసీఆర్ గానీ నాకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరు..ఎప్పుడూనేను వారిని పర్సనల్ గా కూడా కలవలేదు. అటువంటిది నన్ను కేటీఆర్ కోవర్టు అని ఎలా అంటావు? అంటూ ప్రశ్నించారు. ఏపీ రాజధానుల గురించి జగ్గారెడ్డి ఎద్దేవా చేస్తూ ..మీ అన్న ఏపీకి మూడు రాజధానులు అంటున్నాడని మూడు రాజధానులు కాదు ఏపీని మూడు రాష్ట్రాలు చేసుకోండి..ముగ్గురు సీఎంలను పెట్టుకోండీ మాకెందుకు? మాపై ఇటువంటి నిరాధారమైన ఆరోపణలెందుకు? జగన్, షర్మిల ఇద్దరు ఒక్కటేనని కానీ బయటకు మాత్రం ఇద్దరివి వేరు వేరు దారులంటూ నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శించారు జగ్గారెడ్డి. నాపై ఆరోపణలు చేయటం కాదు నువ్వేంటో తెలంగాణలో నిరూపించుకో తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాత్రమే పోటీ ఉంటుంది. ఏపీనుంచి వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలతో మాకు పోటీ ఉండనే ఉండదంటూ ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి.

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా జగన్, షర్మిల ఇద్దరు తండ్రి ఆశయాలు నెరవేర్చుతున్నారా అంటూ అడిగారు. ఆస్తుల విషయంలోనూ, వై ఎస్.రాజశేఖర్ రెడ్డికి శ్రద్ధాంజలి సమయంలో జగన్, షర్మిల లు కలిసే ఉంటారు. రాజకీయం వచ్చే సరికి ఇద్దరు వేరు వేరు అంటున్నాంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. జగన్ అన్న వదిలిన బాణం అని అప్పట్లో పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి వదిలిన బాణం అంటున్నారని.. ఇప్పుడు జగన్ వదిలేసిన బాణం అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి ఏ పార్టీ లో ఉంటే నీకెందుకంటూ షర్మిలపై మండిపడ్డారు. తాను ఎక్కడ తిరిగితే నీకెందుకు.. జగ్గారెడ్డి ఏ పార్టీ లో ఉన్నాడో తెలివి ఉన్న వాళ్ళందరికీ తెలుసంటూ షర్మిల వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిల మమ్మల్ని తిట్టడం మానుకోవాలని మమ్మల్ని గెలుకుడు ఎందుకు? అంటూ షర్మిలకు హితవు పలికారు జగ్గారెడ్డి.

కాగా షర్మిల జగ్గారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ..ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా పార్టీ మారాడని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. అసలు వైయస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు? అని ప్రశ్నిస్తూ ఆగ్రం వ్యక్తంచేశారు. కేటీఆర్ కోవర్టు మతి తప్పి పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు కేటీఆర్ కోవర్టు జగ్గారెడ్డి, మతి తప్పి మాట్లాడుతున్నాడని అన్నారు. రోజుకో పార్టీ నువ్వు మారి వైయస్సార్ గురించి మాట్లాడుతావా? అంటూ ప్రశ్నించారు.జగ్గారెడ్డి.. పిచ్చిఎక్కి మాట్లాడుతున్నావా? అంటూ ప్రశ్నించారు. నీ నియోజకవర్గం కోసం ఏనాడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించావా? అంటూ నిలదీశారు. జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు అని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. సంగారెడ్డి నియోజకవర్గానికి ఒక రోజు అయినా ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారా అంటూ నిలదీశారు. జగ్గారెడ్డి వల్ల సంగారెడ్డికి ఏమాత్రం లాభం లేదని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నని వైయస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నువ్వు రేపు ఏ పార్టీలో ఉంటావో నీకే క్లారిటీ లేదు నువ్వా నా గురించి మాట్లాడేది అంటూ వైఎస్ షర్మిల జగ్గారెడ్డిని టార్గెట్ చేశారు.

మీలా పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్ కు పట్టలేదన్నారు వైఎస్ షర్మిల. వైయస్సార్ గెలిచిన పార్టీనే కాంగ్రెస్ లో కలిసిపోయిందని..ఆ మాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని..పార్టీలు మారాల్సిన ఖర్మ వైఎస్సార్ కు పట్టలేదని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. మీలా పార్టీలు మారుతూ రాజకీయ వ్యభిచారం చేసే సంస్కృతి వైయస్సార్ ది కాదంటూ ఘాటు విమర్శలు చేశారు షర్మిల.మరోమారు జగ్గారెడ్డి పార్టీల మార్పుపై మాట్లాడిన వైయస్ షర్మిల పొద్దున టిఆర్ఎస్ మధ్యాహ్నం బిజెపి సాయంత్రం కాంగ్రెస్ అంటూ ఎవరు పిలిస్తే అక్కడికి పోతావ్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.