Telangana Corona : తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 43 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్‌ ప్రభావంతో 43మంది మృతి చెందారు. నిన్న(ఏప్రిల్ 25,2021) 3వేల 804 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తు

Telangana Corona : తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 43 మరణాలు

Telangana Corona

Telangana Corona : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 6వేల 551 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం(ఏప్రిల్ 26,2021) తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు మాత్రం పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో వైరస్‌ ప్రభావంతో 43మంది మృతి చెందారు. నిన్న(ఏప్రిల్ 25,2021) 3వేల 804 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం 65వేల 597 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న రాష్ట్రంలో 73వేల 275 కరోనా టెస్టులు చేశారు.

కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,01,783కు పెరగ్గా.. ఇప్పటి వరకు 3,34,144 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 2వేల 042 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,418.. మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 554, రంగారెడ్డిలో 482, నిజామాబాద్‌లో 388, సంగారెడ్డిలో 368, వరంగల్‌ అర్బన్‌లో 329, జగిత్యాలలో 276, కరీంనగర్‌లో 222, మహబూబ్‌నగర్‌లో 226, సిద్దిపేటలో 268 అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇది మహా ప్రళయమే.. ఒక్కరోజే 2వేల 812 మరణాలు:
దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఈ కేసుల సంఖ్య మూడున్న‌ర ల‌క్ష‌ల మార్క్ దాటింది. గ‌డిచిన 24 గంటల్లో దేశంలో 3లక్షల 52వేల 991 కేసులు న‌మోదు కాగా.. మ‌రో 2వేల 812 మంది మృత్యువాత ప‌డిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం (ఏప్రిల్ 26,2021) వెల్ల‌డించింది. గడిచిన 24 గంటల్లో 2లక్షల 19వేల 272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,73,13,163 చేరింది. మరణా సంఖ్య 1,95,123కి పెరిగింది. 1,43,04,382 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 28లక్షల 13వేల 658 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 14కోట్ల మందికిపైగా టీకాలు వేశారు.

మొత్తం కేసులు : 1,73,13,163
మొత్తం కరోనా మరణాలు : 1,95,123
మొత్తం కోలుకున్న వారు : 1,43,04,382
యాక్టివ్ కేసులు : 28,13,658
ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య : 14,19,11,223