Telangana Corona Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. మరోరోజు వెయ్యికి పైగా కొత్త కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో మరోమారు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. మరోరోజు వెయ్యికి పైగా కొత్త కేసులు

COVID19 cases in India

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో మరోమారు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 43వేల 318 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1061 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 401 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 63 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కేసులు, నల్గొండ జిల్లాలో 51 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46 కేసులు, కరీంనగర్ జిల్లాలో 43 కేసులు గుర్తించారు.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 836 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 23వేల 724 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 13వేల 256 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6వేల 357గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 41వేల 182 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 992 మందికి పాజిటివ్ గా తేలింది.

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

 

తెలంగాణ కరోనా బులెటిన్: