Telangana Covid : తెలంగాణలో 25 కరోనా కేసులు.. కోలుకుంది 53 మంది
ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 53 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 20 కేసులు...
Telangana Corona Cases : భారతదేశ వ్యాప్తంగా కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో పలు రాష్ట్రాలు నిబంధనలను పూర్తిగా సడలిస్తున్నాయి. మాస్క్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండడం.. మరోవైపు వైరస్ బారిన పడిన వారి సంఖ్య కూడా అధికమౌతోంది. గడిచిన 24 గంటల్లో 16 వేల 839 టెస్టులు చేయగా 25 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది.
Read More : AP Covid Cases List : ఏపీలో కొత్తగా 28 కరోనా కేసులు
ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 53 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 20 కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 4, 411గా ఉంది. 7 లక్షల 86 వేల 806 మంది కోలుకున్నారు.
Read More : Telangana : తెలంగాణాలో కరోనా… 26 జిల్లాల్లో సున్నా కేసులు
ఆదిలాబాద్ 00. భద్రాద్రి కొత్తగూడెం 00. జీహెచ్ఎంసీ 20. జగిత్యాల 00. జనగామ 00. జయశంకర్ భూపాలపల్లి 00. జోగులాంబ గద్వాల 00. కామారెడ్డి 00. కరీంనగర్ 01. ఖమ్మం 00. కొమరం భీం ఆసిఫాబాద్ 00. మహబూబ్ నగర్ 00. మహబూబాబాద్ 00. మంచిర్యాల 00. మెదక్ 00. మేడ్చల్ మల్కాజ్ గిరి 01. ములుగు 00. నాగర్ కర్నూలు 00. నల్గొండ 01. నారాయణపేట్ 00. నిర్మల్ 00. నిజామాబాద్ 00. పెద్దపల్లి 00. రాజన్న సిరిసిల్ల 00. రంగారెడ్డి 01. సంగారెడ్డి 01. సిద్ధిపేట 00. సూర్యాపేట 00. వికారాబాద్ 00. వనపర్తి 00. వరంగల్ రూరల్ 00. హన్మకొండ 00. యాదాద్రి భువనగిరి 00. మొత్తం 25.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.01.04.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/Z44GEHz7tM— IPRDepartment (@IPRTelangana) April 1, 2022