Telangana Corona News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 26వేల 284 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 16వేల 506 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 667కి తగ్గింది.
Telangana Covid News : తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదైంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 33వేల 455 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 528 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 196 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33 కేసులు, నల్గొండ జిల్లాలో 32 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 31 కేసులు, కరీంనగర్ జిల్లాలో 25 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 771 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్త కేసుల కన్నా రికవరీలే ఎక్కువ. ఇక రిలీఫ్ ఇచ్చే మరో అంశం కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 26వేల 284 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 16వేల 506 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 667కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 24వేల 938 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 396 మందికి పాజిటివ్ గా తేలింది.
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.08.08.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/uMTx701WnC— IPRDepartment (@IPRTelangana) August 8, 2022