Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 34వేల 814 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 29వేల 410 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,293కి తగ్గింది.
Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 14వేల 271 మందికి కరోనా పరీక్షలు చేయగా, 177 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 69 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 14, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 9 కేసులు, నల్గొండ జిల్లాలో 8 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 298 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 34వేల 814 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 29వేల 410 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,293కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 12వేల 934 మందికి కరోనా పరీక్షలు చేయగా, 159 మందికి పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.02.09.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealth pic.twitter.com/hE7BDdegUp— IPRDepartment (@IPRTelangana) September 2, 2022