Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్.. రోజువారీ కరోనా కేసుల్లో మరింత తగ్గుదల.. రికవరీల సంఖ్యే ఎక్కువ
తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య మరింత తగ్గింది. 500లకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 31వేల 629 కరోనా శాంపిల్స్ పరీక్షించగా
Telangana Covid News : తెలంగాణకు బిగ్ రిలీఫ్. కరోనా రోజువారీ కేసుల సంఖ్య మరింత తగ్గింది. 500లకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 31వేల 629 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 494 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో 223, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 34 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31వేల 629 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 223 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 34 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 1054 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్త కేసుల కన్నా రికవరీలే ఎక్కువ. ఇక రిలీఫ్ ఇచ్చే మరో అంశం కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 26వేల 778 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 17వేల 560 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 107కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 33వేల 455 శాంపిల్స్ నిర్వహించగా.. 528 మందికి పాజిటివ్ గా తేలింది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.09.08.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/O03c43M57F— IPRDepartment (@IPRTelangana) August 9, 2022