Telangana : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు

డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ బోరబండ పరిసర ప్రాంతాల్లోని అమాయకులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు అయేషా తబస్సుమ్‌ను పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నారు.

Telangana : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు

Telangana (6)

Telangana : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ బోరబండ పరిసర ప్రాంతాల్లోని అమాయకులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు అయేషా తబస్సుమ్‌ను పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నారు.

ఇక బుధవారం మరో నిందితురాలు సుప్రియను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ రిమాండ్ కు తరలించారు. ఇక వీరి చేతిలో చాలామంది మోసపోయారని పోలీసులు నిర్దారించారు. ఇప్పటివరకు నలుగురు బాధితులు మాత్రమే ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. వీరి చేతిలో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే దైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలనీ పోలీసులు తెలిపారు.