Liquor shops: మద్యం షాపు యజమానులకు గుడ్ న్యూస్.. లైసెన్సు గడువు పొడిగింపు

మద్యం దుకాణాల యజమానులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏ-4 దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Liquor shops: మద్యం షాపు యజమానులకు గుడ్ న్యూస్.. లైసెన్సు గడువు పొడిగింపు

Shops

Liquor shops: మద్యం దుకాణాల యజమానులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ఏ-4 దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలాఖరుతో దుకాణాల గడువు ముగియాల్సి ఉండగా.. నవంబర్‌ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దుకాణాల లైసెన్సులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే మద్యం పాలసీపై విధి విధానాలు రూపొందించేందుకు ఆబ్కారీశాఖ మంత్రి అధికారులను ఆదేశించింది.

2021-22 సంవత్సరానికి గానూ వైన్స్‌, బార్‌ లైసెన్స్‌లకు సంబంధించిన నిబంధనలు తయారు చేయాలని సూచించారు. గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 1వ తేదీతో దుకాణాల గడువు ముగియాల్సి ఉండగా నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, కొత్త విధానం నేపథ్యంలో పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

మద్యం దుకాణాల్లో గౌడ కులానికి చెందిన వారికి 15 శాతం, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గత కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోగా.. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. త్వరలో జరగబోయే మద్యం దుకాణాల టెండర్ల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. దేశంలోనే తొలిసారిగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.