Ganesh Immersion : హైకోర్టు ఆదేశాలు నిలిపివేయాలంటూ తెలంగాణ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్

గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జానానికి ఈసారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అనుమతివ్వాలని హైకోర్టును కోరింది.

Ganesh Immersion : హైకోర్టు ఆదేశాలు నిలిపివేయాలంటూ తెలంగాణ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్

Ts Govt (1)

Telangana Govt House Motion Petition : ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతించకూడదని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేయాలని ఆదివారం (సెప్టెంబర్12, 2021) తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జానికి ఈసారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూడా అనుమతివ్వాలని కోరింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేసిన 48 గంటల్లోనే క్లీన్ చేస్తున్నామని.. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈసారికి అనుమతివ్వాలని కోరింది.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. నిమజ్జనంపై హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. హుస్సేస్ సాగర్ లో అన్ని విగ్రహాల నిమజ్జానికి అనుమతివ్వాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికిప్పుడు బేబీపాండ్స్ ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Hussain Sagar : గణేష్ నిమజ్జనం ఎక్కడ ? అంతా గందరగోళం

వినాయక నిమజ్జనంపై శుక్రవారం (సెప్టెంబర్9, 2021) తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి నిరాకరించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని హైకోర్టు తెలిపింది.

హుస్సేన్‌సాగర్‌ లో రబ్బరు డ్యాంలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. దూరప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఒకే రోజు కాకుండా ప్రణాళిక ప్రకారం అనుమతించాలని పోలీసులకు సూచించింది. చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేయాలనీ ప్రజలకు కోరింది. నిమజ్జన ప్రాంతాల్లో కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు పంపిణి చేయాలనీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని తెలిపింది.

High Court : గణేష్ మండపాలు, విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా మండపాల ఏర్పాటు ఉండాలని సూచించింది. రోడ్డుకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించింది. మండపాల దగ్గర ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని తెలిపింది హైకోర్టు. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని తెలిపింది. రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని వెల్లడించింది. వినాయకమండపాల వద్ద శానిటైజర్ ఉంచాలని తెలిపింది.