Governor Tamilisai Delhi : ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై.. కేంద్రం దృష్టికి రాష్ట్ర పరిస్థితులు!

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆమె కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉంది.

Governor Tamilisai Delhi : ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై.. కేంద్రం దృష్టికి రాష్ట్ర పరిస్థితులు!

Governor

Governor Tamilisai Delhi : తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆమె కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర బడ్జెట్ విషయంలో జరిగిన పరిణామాలను ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ పర్యటనలో ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో తమిళిసై పాల్గొననున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దలను కలిచే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికే రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం గవర్నర్ ను పిలవడం, ఆమె ప్రసంగించడం లాంటి అనేక అంశాలను కూడా ఢిల్లీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది. గతంలో రిపోర్టు చేసిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తో కేంద్రంతో చర్చించనున్నారు. మొత్తానికి వన్ డే పర్యటనలో భాగంగా గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లారు.

Telangana Assembly sessions : ఈనెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోద్య కుదిరింది. బడ్జెట్ ను గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. హైకోర్టు సూచన మేరు ఇటు ప్రభుత్వం, ఆటు రాజ్ భవన్ తరపు న్యాయవాదులు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చారు.

అసెంబ్లీ సమావేశాల రాజ్యాంగ బద్ధ నిర్వహణకు నిర్ణయించుకున్నామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించారు. దీంతో గవర్నర్ తమిళిసై ఉబయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.