తెలంగాణ అన్ లాక్ – 5 : పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 100 మంది
telangana Unlock 5 guidelines : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో..అన్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. కేంద్రం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. అందులో భాగంగా…తెలంగాణ రాష్ట్రం కొన్నింటికి మాత్రమే అనుమతినిచ్చింది.
క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్పూళ్లు, పీజీ, పీహెచ్డీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ఈ నెల 15వ తేదీ తర్వాత ల్యాబుల్లో ప్రయోగాలు, సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ సమావేశాల్లో గరిష్ఠంగా 100 మంది, పెండ్లిళ్లు, అంత్యక్రియలకు 100 మంది హాజరు కావాలని సూచించింది. కొవిడ్-19 నిబంధనలు తప్పక పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
65 ఏండ్లకుపైబడిన వారు, 10 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు వీలైనంతవరకు ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో ఈ నెల 31వరకు లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆన్లైన్ క్లాసులు, దూర్యవిద్యను ప్రోత్సహిస్తామని, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్లు, వినోద పార్కులు వంటివి తెరిచే తేదీలపై త్వరలో ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.