Inter Exams : ఇంటర్ పరీక్షలు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలన్న తల్లిదండ్రుల సంఘం పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి ఎగ్జామ్స్ ఉండగా, ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని కోర్టు

Inter Exams : ఇంటర్ పరీక్షలు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు

Inter Exams

Inter Exams : ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలన్న తల్లిదండ్రుల సంఘం పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి ఎగ్జామ్స్ ఉండగా, ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని కోర్టు ప్రశ్నించింది. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. కోర్టు తీర్పుతో తల్లిదండ్రుల సంఘం పిటిషన్ ఉపసంహరించుకుంది. దీంతో అక్టోబర్ 25 నుంచి ఫస్టియర్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

”ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను రద్దు చేయడం సమంజసం కాదు. ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైంది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలి”-హైకోర్టు.

weight : ప్రసవం తరువాత బరువు తగ్గటం ఎలా?

”ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ కు పంపుతున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తర్వాత విద్యార్థులంతా రెండో సంవత్సరం పాఠాలు చదువుకుంటున్నారని, ఇలాంటి సమయంలో మళ్లీ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే వారు గందరగోళంలో పడిపోతారని” తల్లిదండ్రుల తరఫు న్యాయవాది వాదించారు.

అయితే విద్యార్థులు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, వచ్చే ఏడాది కూడా ఏవైనా అవాంతరాలు వచ్చి ఇంటర్ సెకండియర్ పరీక్షలు కూడా రాయలేకపోతే ఈ విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పరిగణించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని ఇంటర్‌ బోర్డు తరఫు న్యాయవాది వివరించారు. అంతేకాక విద్యార్థులను సెకండియర్ కు ప్రమోట్ చేసినప్పుడే పరిస్థితులను బట్టి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇరువర్గాల వాదనలూ విన్న హైకోర్టు చివరి నిమిషంలో పరీక్షల నిర్వహణలో తాము జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.

పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ వల్ల విద్యార్థులు పరీక్షలు జరుగుతాయా? లేదా? అనే అయోమయంలో పడతారని వ్యాఖ్యానించింది. కావున పిటిషన్‌ వెనక్కు తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. శుక్రవారం హైకోర్టులో విచారణ చేపట్టాల్సిన పిటిషన్ల జాబితాలో ఈ పిటిషన్‌ లేదు. దీంతో దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం అత్యవసరంగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.

Urine : మూత్రం ఎక్కువ సేపు ఆపుకుంటే?

శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కాగా, సోమవారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలా చివరి నిమిషంలో పరీక్షల నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. పిటిషన్‌ వాపసు తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంగీకారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 58 మంది విద్యార్థులకు పరీక్షలు రాయనున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలని గురువారం పేరేంట్స్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇంటర్ ఫస్టియర్ ప్రమోట్ అయిన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించవద్దని పిటిషన్‌లో కోరింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.