Donga mallanna Temple : ‘దొంగమల్లన్న’ దేవాలయం .. దొంగకీ ఈ గుడికీ సంబంధమేంటి..?

భోగ మల్లన్న పేరు విన్నాం.. కోమురవెల్లి మల్లన్నను కొలిచాం.. శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకున్నాం.. కాని దొంగ మల్లన్న పేరు ఎప్పుడైనా విన్నారా..? దొంగకు గుడి ఏంటి... పూజలేంటి అనుకుంటున్నారా..? అవును దొంగ మల్లన్న పేరుతో ఉన్న గుడి మన తెలుగురాష్ట్రాల్లోనే ఉంది.. ఇంతకీ దొంగకీ.. గుడికీ సంబంధమేంటి..?

Donga mallanna Temple : ‘దొంగమల్లన్న’ దేవాలయం .. దొంగకీ ఈ గుడికీ సంబంధమేంటి..?

lard Donga mallanna Temple

Donga mallanna Temple : భోగ మల్లన్న పేరు విన్నాం.. కోమురవెల్లి మల్లన్నను కొలిచాం.. శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకున్నాం.. కాని దొంగ మల్లన్న పేరు ఎప్పుడైనా విన్నారా..? దొంగకు గుడి ఏంటి… పూజలేంటి అనుకుంటున్నారా..? అవును దొంగ మల్లన్న పేరుతో ఉన్న గుడి మన తెలుగురాష్ట్రాల్లోనే ఉంది.. ఇంతకీ దొంగకీ.. గుడికీ సంబంధమేంటి..?

జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేట.. ప్రతి ఏటా డిసెంబర్ వచ్చిందంటే చాలు…మల్లన్నపేటలో ప్రతిరోజు పండగే. ఎంతో ప్రసిద్ధి చెందిన దొంగ మల్లన్న స్వామి గుడి ఉన్నది ఇక్కడే.. కాకతీయుల కాలంలో రాత్రికి రాత్రే నిర్మించబడిన దేవస్థానం ఇది. కోరిన కోర్కెలు తీర్చే మల్లన్నను.. దొంగ మల్లన్న స్వామిగా భక్తులు ఆరాధిస్తుంటారు. ప్రతి ఏటా మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే షట్టి మొదలుకొని ఏడు వారాల పాటు బోనాల జాతర జరుగుతుంది. డిసెంబర్‌ నెలంతా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది..

జగిత్యాల జిల్లాలో జరిగే ఈ జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే ప్రతి ఆదివారం, బుధవారాలలో భక్తులు వేకువ జామునే లేచి ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ కాలంలో వచ్చిన పంటతో స్వామివారికి కొత్త కుండలో బోనం తయారు చేసి.. డప్పు చప్పుళ్లతో.. స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం.. స్వామివారికి బోనం నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామి వారికీ దండి వారం ఎంతో ప్రీతిపాత్రం కావడంతో ఆ రోజున ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. గొల్లకురుమల డప్పు వాయిద్యాలు, శివసత్తుల పునకాలతో 7వారాలు ఆలయ ప్రాంగణం మార్మోగిపోతుంది. ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట, వరంగల్,మంచిర్యాల జిల్లాల నుంచి భక్తులు జాతరకు వచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు.

మల్లన్న స్వామి జాతరకు వచ్చే భక్తులు పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. గురవారం (డిసెంబర్ 2022)నాడు నాగపెల్లి, పెద్దపట్నాలు, అగ్ని గుండాలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోరిన కోరికలు తీరుతుండడంతో భక్తులు స్వామి వారిని ఇష్ట దైవంగా పూజిస్తుంటారు. ఎంతో నిష్టగా మల్లన్న స్వామిని ఆరాధిస్తారు. ఇక డిసెంబర్ 22న జరిగే మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, చండీహవనం, పూర్ణహుతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి.

మల్లన్నస్వామి ఆలయాన్ని 11వ శతాబ్దపు చివరి భాగంలో పలాస పాలకులు నిర్మించారని ఓ వాదన ఉండగా.. కాకతీయుల కాలంలోనే నిర్మాణం జరిగినట్లు మరో వాదన కూడా వినిపిస్తోంది.. 15,16వ శతాబ్ధంలో వెలమ దొరలు, తంబీరులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. అయితే ఈ స్వామికి దొంగ మల్లన్న అనే పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. కొన్నేళ్ల క్రితం పలాస పాలకులకు చెందిన కొన్ని ఆవులు చోరీకి గురయ్యాయట.. ఈ విషయం రాజుకు తెలియడంతో.. దొరికిపోతామని భావించిన దొంగలు.. మల్లికార్జున స్వామి విగ్రహం వద్దకు వెళ్లి.. తమను కాపాడితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట.. దీంతో కోటలోంచి తెచ్చిన ఆవులు రంగు మారిపోయాయట. తమ కోరిక తీర్చిన స్వామికి రాత్రికి రాత్రే దొంగలు గుడి కట్టించారని.. అందుకే ఈ ఆలయానికి దొంగమల్లన్న స్వామి పేరు వచ్చిందని చెబుతుంటారు మల్లన్నపేట గ్రామస్తులు..దొంగ మల్లన్నగా పేరుగాంచిన ఈ ఆలయానికి ఏడువారాల్లో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామంలో జరిగే జాతరతో మల్లన్న పేట ఊరంతా సందడి మారుతుంది.