Telangana Assembly: హైకోర్టు ఆదేశాల మేరకే 3 గ్రామ పంచాయతీలుగా భద్రాచలం: ఎర్రబెల్లి
హైకోర్టు ఆదేశాల మేరకే 3 గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ జరుగుతుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎర్రబెల్లి వివరాలు తెలిపారు. మూడు గ్రామాలుగా భద్రాచలం ఏర్పాటు కానుందని అన్నారు.

Errabelli
Telangana Assembly: హైకోర్టు ఆదేశాల మేరకే 3 గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ జరుగుతుందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎర్రబెల్లి వివరాలు తెలిపారు. మూడు గ్రామాలుగా భద్రాచలం ఏర్పాటు కానుందని అన్నారు.
భద్రాచలం, సీతారాం నగర్, శాంతి నగర్ గ్రామాలుగా ఏర్పడనుందని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకే మున్సిపాలిటీ కాకుండా మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం వికేంద్రీకరణ, ఆసిఫాబాద్ లో రాజం పేట నూతన గ్రామంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. భద్రాచలాన్ని మూడు కొత్త గ్రామాలుగా, ఆసిఫాబాద్ లో రాజం పేటను నూతన గ్రామంగా ఏర్పాటు చేస్తూ నిన్న శాసన సభలో, నేడు శాసన మండలిలో ప్రవేశ పెట్టిన పంచాయతీ రాజ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భద్రాచలాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ… ఏజెన్సీ ఏరియా కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు భద్రాచలాన్ని మున్సిపాలిటీగా కాకుండా మూడు గ్రామ పంచాయతీలుగా వికేంద్రీకరణ చేయాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు.
సవరణ బిల్లు పూర్తి వివరాలు…
ఈ బిల్లు భద్రాచలం, సారపాక, ఆసిఫాబాద్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి సంబంధించింది.
తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019లో లేదా తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం, 2018లో గానీ ప్రస్తుతం ఈ గ్రామాలలో ఎన్నుకోబడిన సంఘాలు లేవు.
పైన పేర్కొన్న మూడు గ్రామాలను మున్సిపాలిటీలుగా నోటిఫై చేయాలని గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదించింది.
అయితే, భారత రాజ్యాంగంలోని పార్ట్ 9Aలోని ఆర్టికల్ 243-ZC (3) లో సూచించిన విధంగా పార్లమెంటు షెడ్యూల్డ్ ప్రాంతాలను విస్తరించే వరకు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో మునిసిపాలిటీలు సాధ్యం కాదు.
భద్రాచలంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర చర్యను సవాలు చేస్తూ హైకోర్టులో కొంతమంది పిల్ దాఖలు చేశారు.
దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీని ప్రకారం, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కలెక్టర్లు ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాకలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించారు.
భద్రాచలం ఏజెన్సీ గ్రామం 50,087 జనాభాతో 2,047 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. గిరిజన జనాభా 4,680.
పరిపాలనా వికేంద్రీకరణ, సమర్థవంతమైన పాలన కోసం, భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలుగా (1) భద్రాచలం, (2) సీతారాం నగర్ (3) శాంతి నగర్ గా భద్రాచలం మండలం, భద్రాచలం జిల్లాగా ఏర్పాటు చేయాలి.
సారపాక గ్రామం ITC కంపెనీతో పాటు ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉంది. వలస జనాభా అధికంగా ఉంది.
భౌగోళిక ప్రాంతం 4,244ఎకరాలు.
ఇది 32 వార్డులను కలిగి ఉంది. గోదావరి నదిని కలిగి, శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయానికి ప్రవేశ ద్వారంగా పనిచేస్తుంది.
అందుకే సారపాక గ్రామ పంచాయతీ రెండు గ్రామ పంచాయతీలుగా (1) సారపాక (2) ITC గ్రామాలుగా బూర్గంపహాడ్ మండలం, భద్రాద్రి కొత్తగూడం జిల్లాగా ఏర్పాటు చేయాలి.
ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు కేంద్రంగా ఆసిఫాబాద్, జనకపూర్, రాజంపేట, గొడవెల్లి అనే నాలుగు రెవెన్యూ గ్రామాలను కలిగి ఉంది.
రాజంపేట గ్రామం కుమ్రమ్ భీంలోని ఏజెన్సీ గ్రామం. ఈ గ్రామం చాలా తక్కువ విస్తీర్ణం కలిగి ఉంది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం 185 ఎకరాల విస్తిర్ణం, జనాభా 1,794 ఉంది. ప్రస్తుత అంచనా జనాభా 1,973.
రాజంపేటను ప్రత్యేక గ్రామంగా మార్చడం చాలా ముఖ్యమైనది.
దానికి అనుగుణంగా మంత్రి మండలి ముందు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు.
తెలంగాణ షెడ్యూల్ 8 కి సవరణ చేయడం ద్వారా భద్రాచలం, సారపాక మరియు రాజంపేట ఏజెన్సీ గ్రామాలని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేయడానికి మంత్రి మండలి తీర్మానాన్ని ఆమోదించింది.
పంచాయతీ రాజ్ చట్టం, 2018, షెడ్యూల్ 8 కి సవరణ చేయడానికి శాసనసభ, శాసనమండలి ముందు బిల్లును ప్రవేశపెట్టారు.
తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం, 2018, సెక్షన్ 3 (2) ప్రకారం రాష్ట్ర శాసనసభ ఈ చట్టానికి సవరణ ద్వారా, ఈ చట్టం షెడ్యూల్ 8 ని సవరించవచ్చు లేదా జోడించవచ్చు లేదా మార్చవచ్చు.
ఏదైనా గ్రామం నుండి స్థానిక ప్రాంతాన్ని వేరు చేయడం ద్వారా లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రామాలు లేదా గ్రామాల భాగాలను కలపడం ద్వారా లేదా ఏదైనా స్థానిక ప్రాంతాన్ని ఏదైనా గ్రామంలోని ఒక భాగానికి కలపడం ద్వారా కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేయవచ్చు.
దీని ప్రకారం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 (సెక్షన్ నం.5) షెడ్యూల్ 8 ని సవరించడం ద్వారా ఎగువ గ్రామాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Telangana Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా.. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం