Telangana Lockdown : ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..తెలుసుకోవాల్సిన విషయాలు
E pass : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతోంది. 2021, మే 12వ తేదీ ఉదయం 10 గంటల 06 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు, మొత్తం 10 రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కాలంలో…వేరే రాష్ట్రాలకు, పొరుగున్న ఉన్న ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ పాస్ విధానం కంపల్సరీ అని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి వెల్లడించారు.
ఈ పాస్ విధానం ద్వారా..ప్రత్యేక పాస్ లు అందచేస్తున్నామన్నారు. ఈ- పాస్ లకు కోసం https://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. లాక్డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే మిగతా సమయంలో ప్రయాణించే వారు మాత్రం వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
1. ఈ-పాస్ ధరఖాస్తు విధానం :
మొదట ఈ-పాస్ వెబ్సైట్ (https://policeportal.tspolice.gov.in/) ఓపెన్ చేసి ఈ-పాస్ మీద క్లిక్ చేయాలి.
2. ప్రస్తుతం నివసిస్తున్న జిల్లా / కమిషనరేట్ను ఎంపిక చేసుకోవాలి.
3. మీ పేరు, ఆధార్ నెంబర్, వాహనం, ఎంతమంది, పాస్ ఎందుకు, దేని కోసం, ఫోన్ నెంబర్లు, మీరు వెళ్లాల్సిన పోలీస్ స్టేషన్ పరిధి, డిస్టెన్స్, తదితర వివరాలు నమోదు చేయాలి. ఫొటో, పర్పస్ డాక్యుమెంట్, కేవైసీ ఫాంలను అప్లోడ్ చేయాలి.
4. ఒక acknowledgment number(రశీదు సంఖ్య) వస్తుంది.
5. మీరు వెనక్కి వెళ్లి సిటిజన్ ప్రింట్ పాస్ క్లిక్ చేసి రశీదు సంఖ్య నమోదు చేయండి.
6. వెళ్లాలి అనుకున్న పరిధుల్లోని కమిషనరేట్, ఎస్పీల నుంచి ఈ పాస్ మంజూరు అవుతుంది.