Manikanth Reddy : ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

కొడుకు మృతి చెందిన వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫిలిప్పీన్స్ దేశం నుండి స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

Manikanth Reddy : ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

Manikanth Reddy

Manikanth Reddy : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన పలువురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వరుసగా చనిపోతున్నారు. మొన్న అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్ర యువకుడు మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. తాజాగా ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్థి మృతి చెందారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన మెడికల్ విద్యార్థి మృతి చెందారు. ఫిలిప్పీన్స్ లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన గూడూరు మణికాంత్ రెడ్డి (22) 8 నెలల క్రితం వైద్య విద్యను అభ్యసించడానికి ఫిలిప్పీన్స్ దేశంలోని దవోవా మెడికల్ కాలేజీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున మణికాంత్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు దవావో కళాశాల నుండి మృతుడి తల్లిదండ్రులకు ఫోన్ లో సమాచారం వచ్చింది.

Hemant Sivaramakrishna : అమెరికాలో ఖమ్మం విద్యార్థి గుండెపోటుతో మృతి

కొడుకు మృతి చెందిన వార్త తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో శోకసముద్రంలో మునిగిపోయారు. ఫిలిప్పీన్స్ దేశం నుండి స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.