Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి
హెల్త్ హబ్ గా వరంగల్ ను తీర్చిదిద్దుతున్నామని..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

Minister Errabelli Dayakar rao inaugurates ct scan at warangal : వరంగల్ ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతున్నామని..పేదవారు ఇకనుంచి వైద్యం గురించి ఏమాత్రం దిగులు పడవద్దని..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం అందేలా వరంగల్ ను తీర్చి దిద్దుతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యరంగం సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతోను..మంత్రి హరీశ్రావు కృషితోను రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రూ.2.14కోట్ల విలువైన కొత్త సిటీస్కాన్ను ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీస్కాన్ మిషన్ పనితీరు తదితర వివరాలపై సూపరింటెండెంట్, టెక్నీషియన్స్ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వరంగల్ను హెల్త్హబ్గా ప్రకటించిందని..హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్యసదుపాయాలు వరంగల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం అని అన్నారు. ఈ సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. రూ.1100 కోట్లతో అతిపెద్ద ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్లు కార్పొరేట్ స్థాయిలో చేసేలా ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, అదే తరహాలో ఇక్కడ వైద్యసేవలు నిరంతరం అందాలని ప్రజలతో పాటు ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఎంజీఎం డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని, అందుకే ఎంజీఎంలు అత్యవసర, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యసవర విభాగంలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ ద్వారా అత్యవసర చికిత్సలు అందించేందుకు వీలవుతుందన్నారు.
ఇప్పటికే ఆసుపత్రులో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. పాత సెంట్రల్ జైలు స్థలంలో రూ.1100కోట్లతో 24 అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని..అన్నారు.
- Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
- Teachers: టీచర్లు ఆస్తి వివరాలు ఇవ్వాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ
- MLA Raghunandan: రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధింపుకోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు.. జూన్ 25ను బ్లాక్ డేగా ప్రకటించాలి
- TRS Bhavan : ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు వేగవంతం
- sharmila: ఈ సారి బాగా ఆలోచించి ఓటు వేయాలి: షర్మిల
1Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
2New Fraud: ఇవాళ్టితో మీ కరెంట్ సప్లై ఆపేస్తాం.. కొత్త మోసం గురించి తెలుసుకోండి
3IndVsIreland T20I : భారత్, ఐర్లాండ్ టీ20 మ్యాచ్కి వరుణుడి ఆటంకం
4Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Teacher Rajitha : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు కొండ కోనలు దాటి టీచరమ్మ సాహసం
6Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
7TS Inetr Results: ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..
8Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య
9Tragedy : సనత్నగర్లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు
10Bank Holidays: జూలై నెలలో 14రోజులు బ్యాంకులు బంద్.. సెలవులు ఏఏ రోజంటే..
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?