గెలుపెవరిది : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. శనివారం(జనవరి 25,2020)
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. శనివారం(జనవరి 25,2020)
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రతి వార్డుకు రెండు టేబుట్స్ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభజించి బండిల్గా కడతారు. అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. 120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో బరిలో నిలిచిన 12వేల 926 మంది అభ్యర్థుల భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది.
అందరి సమక్షంలో స్ట్రాంగ్ రూముల తలుపులు తెరుస్తారు:
ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7గంటల వరకే చేరుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. అందరి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచి, బ్యాలెట్ బాక్సులు పరిశీలించి, ఆ తర్వాత కౌంటింగ్ హాల్లోకి తరలించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్ట్రాంగ్ రూమ్లోనే తెలియజేయాలని.. ఆలస్యంగా వచ్చి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాల పరిశీలన, తిరస్కరణ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు.. రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం కానుంది.
మధ్యాహ్నంలోపే ఫలితాలు:
బ్యాలెట్ పత్రాలు అయినప్పటికీ ఫలితాలు త్వరగా వెలువడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 30 వార్డుల్లోపు ఉన్న మున్సిపాలిటీలే సగానికి పైగా ఉండటంతో మధ్యాహ్నంలోపే ఫలితాలు వెలువడనున్నాయి. కేవలం పది వార్డులు ఉన్న వడ్డేపల్లి, అమరచింత, ఆత్మకూర్, చండూరు, ఆలంపూర్ లాంటి చోట్ల.. ఉదయం 11 గంటల వరకే రిజల్ట్ రానుంది. 60 వార్డులు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్లో ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడే అవకాశముంది. అటు కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఫలితాలు వెలువడే వరకు కౌంటింగ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ విధించారు.
* మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
* అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
* రాష్ట్ర వ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలు
* 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు
* ఉ.10 గంటలకు వెలువడనున్న తొలి ఫలితం
* ప్రతీ వార్డుకు రెండు టేబుళ్లు ఏర్పాటు
* మధ్యాహ్నంలోపే పూర్తి ఫలితాలు
* కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధింపు
* తేలనున్న 12,926 మంది అభ్యర్థుల భవితవ్యం
* మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్ పత్రాలు
* ఓట్ల లెక్కింపు కోసం 2,619 టేబుళ్లు ఏర్పాటు
* లెక్కింపులో పాల్గొననున్న 10వేల మంది సిబ్బంది
* సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో అభ్యర్థి ఎన్నిక
* కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత
* ఈ నెల 27న మేయర్లు, చైర్ పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు
* ఈ నెల 29న కరీంనగర్ మేయర్ ఎన్నిక
* జనవరి 25న సాయంత్రం నుంచి పరోక్ష ఎన్నికల కోడ్ అమలు