Telangana : కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులే!

కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. టీ శాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. రికార్డ్ లెసన్స్ అన్నీ టీ శాట్ యాప్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారామె.

Telangana : కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులే!

Tg Online

Online Classes : కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్ లైన్ క్లాసులేనని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. సెట్స్ పరీక్షలు యథాతధంగా జరుగుతాయని ప్రకటించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. టీ శాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. రికార్డ్ లెసన్స్ అన్నీ టీ శాట్ యాప్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారామె. 46 G.O యథాతధంగా అమలవుతుందన్నారు. ఈ ఏడాది కూడా ట్యూషన్ ఫీజుల మాత్రమే వసూలు చేయాలన్నారు. 30 శాతం ఫీజులు తగ్గించుకోమని విజ్ఞప్తి చేశామన్నారు మంత్రి.

మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మొదటి సంవత్సరం రిజల్ట్స్ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. పరీక్ష ఫీజులు చెల్లించిన వారంతా పాస్ అయ్యారని మంత్రి వెల్లడించారు. కరోనా కారణంగా గత సంవత్సరం కూడా ఇంటర్ పరీక్షలను రద్దు అయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత.. సెకండియర్‌వి కొన్ని ఎగ్జామ్స్ ఫలితాలను విడుదల చేశారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ప్రథమ, ద్వితీయ పరీక్షలను రద్దు చేశారు. ఫస్టియర్ లో వచ్చిన మార్క్ లను సెకండియర్ లో కంటిన్యూ చేస్తూ..ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల 51 వేల మంది విద్యార్థులు పరీక్షాల ఫీజులు చెల్లించారు. వీరందరినీ పాస్ చేస్తూ..విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 2 లక్షల 28 వేల 754 మంది బాలికలు ఉండగా..2 లక్షల 22 వేల 831 మంది బాలురున్నారని వెల్లడించారు. ఏ గ్రేడ్ తెచ్చుకున్నవారు లక్షా 76 వేల 719 మంది ఉండగా.. బి గ్రేడ్ తెచ్చుకున్నవారు లక్షా 4 వేల 886 మంది ఉన్నారు.