Telangana లో Corona కేసులు..GHMC లో 277 కేసులు

  • Published By: madhu ,Published On : September 15, 2020 / 11:24 AM IST
Telangana లో Corona కేసులు..GHMC లో 277 కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 984కు చేరింది.




రాష్ట్రంలో కొత్తగా 2వేల 180 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కాగా.. మరో 23వేల 534 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
https://10tv.in/this-uk-couples-wedding-was-a-full-house-with-guests-cardboard-cutouts-worth-rs2-lakhs-covid-19-situation/
ఇక జిల్లాల్లో కొత్తగా నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే..
జీహెచ్ఎంసీలో 277, రంగారెడ్డి 143, కరీంనగర్ 135, వరంగల్ అర్బన్ 108, సిద్ధిపేట్ 106, ఖమ్మం 103, మేడ్చల్ 97, నల్గొండ 96, నిజామాబాద్ 84, భద్రాద్రి 75, మహబూబా బాద్ 68, సూర్యపేట్ 62, యాదాద్రి 53, జగిత్యాల 52 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.