Telangana Corona Cases : తెలంగాణలో ఒక్కరోజే 4వేల 416 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 20వేల 243 కరోనా టెస్టులు చేయగా..
Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 20వేల 243 కరోనా టెస్టులు చేయగా.. కొత్తగా 4వేల 416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
Vitamin D : శరీరంలో విటమిన్ డి అధికమైతే కొత్త సమస్యలు
గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కోవిడ్ తో చనిపోయిన వారి సంఖ్య 4,069కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి 1,920 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29వేల 127 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1670 కేసులు నమోదయ్యాయి.
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,26,819కి చేరింది. ఇందులో 6,93,623 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మరణాలు రేటు 0.56శాతం, రికవరీ రేటు 95.43శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1670, మేడ్చల్ మల్కాజ్గిరిలో 417, రంగారెడ్డిలో 301, హనుమకొండలో 178, ఖమ్మంలో 117 కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్నటితో (4,207) పోలిస్తే ఇవాళ 209 కేసులు అధికంగా వచ్చాయి. రోజురోజుకి కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం (జనవరి 20) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభించారు. ఫీవర్ సర్వేలో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, జ్వరం ఉన్నవారికి అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని, చాలామంది పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదని… అందుకే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లి పరీక్షలను చేపడుతోందని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
Corona Side Effect: కరోనా నుంచి కోలుకున్నాక ఎదురయ్యే సమస్యలు ఇవే..!
సీఎం కేసీఆర్ సూచనల మేరకు 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసొలేషన్ కిట్లు సిద్ధం చేశామన్నారు. వీటిని గ్రామ స్థాయి వరకు పంపించామని చెప్పారు. రాష్ట్రంలోని 27 వేల పడకలను ఆక్సిజన్ బెడ్లుగా మార్చామని మంత్రి తెలిపారు. 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నిర్మించుకున్నామని వివరించారు. కరోనా లక్షణాలు ఉంటే దగ్గర్లోని బస్తీ దవాఖానా లేదా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే హోం ఐసొలేషన్ కిట్ ఇస్తారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.21.01.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/qxwijpuaOb— IPRDepartment (@IPRTelangana) January 21, 2022