Telangana Covid List : తెలంగాణలో కొత్తగా 20 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల..(Telangana Covid List)
Telangana Covid List : తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల 701 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 20 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 9 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో ఏడుగురు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు.
రాష్ట్రంలో ఇంకా 226 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో ఇప్పటివరకు 7లక్షల 91వేల 542 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 87వేల 205 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 15వేల 561 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 24 మందికి పాజిటివ్ గా తేలింది.(Telangana Covid List)
Corona 4th Wave: దేశంలో కరోనా నాలుగో దశ రానుందా?: నిపుణులు ఏమంటున్నారంటే
అటు దేశంలోనూ కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 4 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 796 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు కొద్దిగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో మరో 946 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గి, 10 వేలకు దిగొచ్చాయి. యాక్టివ్ కేసుల రేటు 0.03 శాతంగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఒక్క రోజు వ్యవధిలో మరో 19 మంది కొవిడ్ తో మరణించారు. ఇక నిన్న 15.6 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 185 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. మరోవైపు 18 ఏళ్లు దాటిన వారికి ప్రికాషనరీ డోసు ఇస్తున్న విషయం విదితమే.(Telangana Covid)
ఇది ఇలా ఉంటే.. దేశంలో కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కరోనా నియంత్రణ నిమిత్తం శరవేగంగా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నా.. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయంపై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) చీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా మాట్లాడారు. దేశంలో ఒకటి రెండు చోట్ల బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్.. తీవ్రమైన సంక్రమణకు దారితీయనందున ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆయన అన్నారు.
ఇతర దేశాల నుంచి వస్తే తప్ప, మన దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా.. అలాంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్-జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు ఇప్పటి వరకు వెలుగు చూసిన అన్ని వేరియంట్లలో Covid -19 XE వేరియంట్ ఆసియాలో తీవ్ర వ్యాప్తిలో ఉందని.. నిత్యం 14 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు ఆసియా దేశాల్లో నమోదు అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. చైనాలో ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర వ్యాప్తిలో ఉండగా.. మహమ్మారి కట్టడికి చైనాలో కఠిన లాక్ డౌన్ విధించారని WHO తెలిపింది.(Telangana Covid)
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.12.04.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/fx4vkdksvn— IPRDepartment (@IPRTelangana) April 12, 2022