Telangana: 30న పదో తరగతి పరీక్ష ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఈ నెల 30న ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.
Telangana: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30న ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థులు ఫలితాలను www.bse.telangana.gov.in లేదా www.bseresults.telangana.gov.in లో చూసుకోవచ్చని పేర్కొంది.
Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ లేఖ
తెలంగాణలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోపే ఫలితాలను వెల్లడిస్తుండడం గమనార్హం. ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు విడుదలైన విషయం తెలిసిందే.