Vaccination For Students : విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రారంభం

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా స్లాట్ బుక్కింగ్ ప్రక్రియను రూపొందించింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. నిన్నటినుంచి (జూన్ 4,2021)నుంచి ప్రారంభమైన స్లాట్ బుక్కింగ్ ద్వారా ఈరోజు నారాయణగూడలోని IPMని వ్యాక్సినేషన సెంటర్ గా మారి విద్యార్ధులకు వ్యాక్సిన్ వేస్తోంది.

Vaccination For Students : విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ ప్రారంభం

Telangana Vaccination For Students

Telangana Vaccination for students : ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. ఈరోజు 350 మంది విద్యార్ధులకు వ్యాక్సినేషన్ ప్రారంభించింది. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా స్లాట్ బుక్కింగ్ ప్రక్రియను రూపొందించింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. నిన్నటి నుంచి (జూన్ 4,2021)నుంచి ప్రారంభమైన స్లాట్ బుక్కింగ్ ద్వారా ఈరోజు నారాయణగూడలోని IPMని వ్యాక్సినేషన సెంటర్ గా మారి విద్యార్ధులకు వ్యాక్సిన్ వేస్తోంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇప్పటి వరకూ 7వేలమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి స్లాట్ బుక్ చేసుకున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమెరికా, యూకేతో పాటు ఇతర దేశాల్లోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేయడంతో.. ఇప్పటికే విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు ఖరారు చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో విదేశాలకు వెళ్లే విద్యార్దుల కోసం ప్రత్యేకంగా టీకాలు వేయాలని నిర్ణయించింది. టీకాలు వేసేందుకు శుక్రవారం (జూన్ 4) పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురాగా.. తొలిరోజు మూడువేల మంది విద్యార్ధులు అప్లై చేసుకున్నారని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. కేటగిరిలో రోజుకు 350 మందికి టీకాలు వేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. శనివారం టీకాలు తీసుకోనున్న 350 మంది విద్యార్థులకు మెస్సేజ్‌లు పంపారు. అలా విడుతల వారీగా విద్యార్థులందరికీ మెస్సేజ్‌లు వస్తాయని..మెసేజ్ లు వచ్చినవారు మాత్రమే వ్యాక్సిన్ వేయించుకోవటానికి రావాలని సూచించారు వైద్య అధికారులు. విద్యార్ధులందరికీ వ్యాక్సిన్ వేస్తామని ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

మరో వైపు విద్యార్థుల సౌలభ్యం కోసం రెండో టీకా పొందే గడువును కూడా ప్రభుత్వం సడలించింది. తొలిడోసు తీసుకున్న నాలుగు వారాలకే రెండో డోసు పొందడానికి అవకాశం కల్పించింది. సాధారణంగా వ్యాక్సిన్ మొదటి డోసు వేసుకున్న తరువాత 4 నుంచి 6 వారాలు పూర్తి అయ్యాక రెండో డోసు వేస్తారు. కానీ విద్యార్ధుల విషయంలో ఈ నిబంధనను సడలించారు. దీంట్లో భాగంగా స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్ధులకు హైదరాబాద్‌ నారాయణగూడలోని ఐపీఎం ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ టీకా పంపిణీ ప్రారంభమైంది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చిన విద్యార్ధులకు టీకాలు వేస్తున్నారు. టీకా వేయించుకునేందుకు ప్రతి విద్యార్థి తన మొబైల్‌కు వచ్చిన మెసేజ్ ఓటీపీని తప్పక చూపించాల్సి వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. పాస్‌పోర్టుతో పాటు వీసాను కూడా వెంట తెచ్చుకోవాలి, వీసా లేకపోతే.. ఏ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారో ఆ సంస్థలో ఎంట్రీ డాక్యుమెంట్స్ కూడా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చే ప్రతీ విద్యార్థీ సంబంధిత పేపర్స్ తీసుకురాలి.