TS TET : నేడు టెట్ ఎగ్జామ్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్ టెట్) నేడు జరగనుంది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరగడం ఇది మూడోసారి. రెండు పేపర్లు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

TS TET : నేడు టెట్ ఎగ్జామ్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

Ts Tet

TS TET : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్ టెట్) నేడు జరగనుంది. ఇందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ జరగడం ఇది మూడోసారి. రెండు పేపర్లు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకుగాను పేపర్-1పరీక్షకు 1480, పేపర్-2 పరీక్షకు 1,203పరీక్షా కేంద్రాలు కాగా.. రెండు పేపర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ లో 212, అత్యల్పంగా ములుగు జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను అధికారులు పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు.

TS TET 2022: రేపు టెట్ పరీక్ష.. అభ్యర్థులు ఈ ఐదు అంశాలు తప్పనిసరిగా పాటించాలి

టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా మార్పులు చేయడంతో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులవుతారు. పేపర్-2 రాయడం ద్వారా బీఈడీ అభ్యర్థులు స్కూట్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత పొందుతారు. ఈ పేపర్-2 రాసే వారు కూడా పేపర్-1 రాసి ఎస్టీటీలుగా అర్హత పొందేలా మార్పులు చేశారు. దీంతో పేపర్-1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాలు ఉంటారు. వీటిని ఇంటర్నెట్ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. పరీక్ష ప్రారంభం నుంచి ముగిసే వరకు వీడియో రికార్డింగ్ చేయనున్నారు.

TET : టెట్‌ సర్టిఫికెట్‌ ఉద్యోగం వచ్చేవరకు చెల్లుబాటు

టెట్ పరీక్ష రాసే అభ్యర్థులు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్ లోకి అనుమతించరు. ఈ పరీక్ష నిర్వహణకోసం మొత్తం 29,513 మంది ఇన్విజిలేటర్లను, 1480 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 1480 మంది డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు, 252 మంది ఫ్లైయింగ్ స్వ్కాడ్స్ ను నియమించారు.